Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వాస్తు, గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం తలుపుతట్టాలంటే.. పసుపుతో ఈ ఒక్క పనిచేయండి చాలు..

పసుపుతో, మీరు మీ ఇంటి వాస్తు దోషాలను తొలగించవచ్చు. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా సులభంగా తొలగిస్తుంది. ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులందరి మధ్య పరస్పర విబేధాలు సర్వసాధారణం.

Vastu Tips: వాస్తు, గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం తలుపుతట్టాలంటే.. పసుపుతో ఈ ఒక్క పనిచేయండి చాలు..
Vastu Tips
Follow us
Madhavi

|

Updated on: Apr 17, 2023 | 10:50 AM

పసుపుతో, మీరు మీ ఇంటి వాస్తు దోషాలను తొలగించవచ్చు. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా సులభంగా తొలగిస్తుంది. ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులందరి మధ్య పరస్పర విబేధాలు సర్వసాధారణం. తగాదాలు రోజువారీ జీవితంలో భాగమే. ఇంట్లో ఉండే వాస్తు లోపాలు లేదా ప్రతికూల శక్తి కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణం కావచ్చు.

వాస్తు పండితుల ప్రకారం పసుపు సహాయంతో, మీరు మీ ఇంటి వాస్తు దోషాలను తొలగించవచ్చు. అంతే కాదు, ఈ రెమెడీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని కూడా చాలా సులభంగా తొలగిస్తుంది. పసుపుతో ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం.

పసుపు నివారణలు ఎలా చేయాలి:

ఇవి కూడా చదవండి

-పార్వతీ దేవిని పూజించేటప్పుడు తరచుగా పసుపును కూడా పూస్తారు. పూజలో ఉపయోగించే ఈ పసుపును నీళ్లలో కరిగించి ఇంటింటా చల్లుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ పరిహారం దయ్యాలు మొదలైన వాటి నుండి కూడా రక్షిస్తుంది.

-ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించే ఔషధంగా కూడా పసుపును వర్ణిస్తారు. గురు పుష్య నక్షత్రంలో లేదా గురువారం ఏదైనా శుభ ముహూర్తంలో, ఇంటి ప్రధాన ద్వారంకి ఇరువైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నం చేయండి. దీని వల్ల ఇంట్లో నివసించే వారు పురోభివృద్ధి చెందడంతోపాటు ఇంట్లో ఆనందం, శాంతి కూడా నెలకొంటుంది.

-జాతకంలో కుజుడు అశుభంగా ఉన్నప్పుడు పసుపు రంగు వస్తువులు దానం చేస్తారు. జ్యోతిష్కుని సలహాతో పసుపును దానం చేయడం ద్వారా మీరు కష్టాల నుంచి బయటపడతారు.

-. ఇంట్లో లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందాలంటే, మీరు మీ డబ్బును ఉంచే ఇంటి అల్మారాలో లేదా ఖజానాలో పసుపు ముద్దను ఉంచాలి.

-.ఈ పరిహారం ఇంట్లో డబ్బు స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఆర్థిక విజయాన్ని ఇస్తుంది. అలాగే, కుబేర్ యంత్రం లేదా శ్రీ యంత్రాన్ని ఖజానాలో ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది.

-కనీసం వారానికి ఒకసారి ఇంట్లో కర్పూరం కాల్చితే దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంటి సభ్యుల ఆదాయం కూడా పెరుగుతూనే ఉంటుంది.

– వాస్తు శాస్త్రం ప్రకారం, పక్షులకు ఆహారం ఇవ్వడం, వాటికి నీరు ఉంచడం వల్ల ప్రయోజనాలు, వ్యక్తిగత అభివృద్ధి కూడా జరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)