Tirumala Temple: శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్.. టీటీడీ చరిత్రలో తొలిసారిగా…

|

Jan 26, 2022 | 12:21 PM

Tirumala Ratha Saptami: దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) విజృంభిస్తున్న వేళ ప్రముఖ పుణ్య క్షేత్రాలపై ఎఫెక్ట్ పడింది.  తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో జరిగే రథ సప్తమి( Ratha Saptami) వేడుకలను..

Tirumala Temple: శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్.. టీటీడీ చరిత్రలో తొలిసారిగా...
Tirumala Ratha Saptami
Follow us on

Tirumala Ratha Saptami: దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) విజృంభిస్తున్న వేళ ప్రముఖ పుణ్య క్షేత్రాలపై ఎఫెక్ట్ పడింది.  తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో జరిగే రథ సప్తమి( Ratha Saptami) వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్నివహించడానికి  టీటీడీ సిద్ధమవుతోంది. అయితే టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఏకాంతంగా రథ సప్తమి వేడుకలు నిర్వహించనున్నారు.  కోవిడ్ ఉధృతి కారణంగా రథ సప్తమి వేడుకలను ఏకాంతంగా జరపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8న రథ సప్తమి రోజు వాహన సేవలను శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నామని టిటిడీ అధికారులు ప్రకటించారు.

గత ఏడాది ఆలయం బయటే వాహన సేవలు ఊరేగింపు నిర్వహించిన టీటీడీ.. ఈ సారి ఏకాంతంగా స్వామివారికి వాహన సేవలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన శ్రీవారు సప్తవాహనాల్లో మాడ వీధుల్లో ఊరేగనున్నారు. రథ సప్తమి వేడుకలు ఆ రోజు ఉదయం సూర్యప్రభ వాహనసేవతో ప్రారంభమై చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవ, హనుమంత వాహనసేవ , కల్పవృక్ష వాహన సేవ ,  సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే.

 

Also Read:

 73వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక వేషధారణలో ప్రధాని మోడీ.. ఆ టోపీ ప్రత్యేకత ఏంటో తెలుసా?

 ఒకే ఒక్క పాన్ ఐడియా మూవీ బన్నీ క్రేజ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది..

అన్నివర్గాల అభివృద్ధియే లక్ష్యం.. ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలనః ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌