Ganapati idols: అత్యద్భుతం.. రైతు పొలం దున్నుతుండగా బయలప్పడ్డ మూషిక వాహనుడైన పురాతన గణపతి విగ్రహం, రాతి పీఠం

|

Jul 31, 2021 | 9:33 PM

సంగారెడ్డి జిల్లాలో అద్భుతం నెలకొంది. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో పొలంలో గణేశుని విగ్రహం, గణపతి పీఠం బయల్పడ్డాయి. అనంత్ రావు దేశముఖ్ అనే రైతు వ్యవసాయ పొలం దున్ను తుండగా..

Ganapati idols: అత్యద్భుతం.. రైతు పొలం దున్నుతుండగా బయలప్పడ్డ మూషిక వాహనుడైన పురాతన గణపతి విగ్రహం, రాతి పీఠం
Vinayaka Peetham
Follow us on

Ganapati Ancient idols: సంగారెడ్డి జిల్లాలో అద్భుతం నెలకొంది. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో పొలంలో గణేశుని విగ్రహం, గణపతి పీఠం బయల్పడ్డాయి. అనంత్ రావు దేశముఖ్ అనే రైతు వ్యవసాయ పొలం దున్ను తుండగా ఈ సాయంత్రం వేళ అతి పురాతన విగ్రహ సముదాయాలు బయటకొచ్చాయి. భూమి నుంచి మూషిక వాహనుడైన గణపతి ప్రత్యక్షం కావడంతో రైతుతోపాటు పొలంలో పనిచేసే వాళ్లంతా నిశ్చేష్టులయ్యారు.

వెంటనే గణపతి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి రైతులు పూజలు చేశారు. ఈ అపురూప దృశ్యానికి తాము ప్రత్యక్ష సాక్షులమైనందుకు రైతన్నలు మురిసిపోతున్నారు. నిమిషాల్లోనే ఈ వార్త నారాయణ్ ఖేడ్ మండలమంతా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు.

ఆనాడే, అత్యంత నైపుణ్యంతో చెక్కిన రాతి గణపతి పీఠం మీద ఉన్న మూషికం గురించి కూడా జనం చర్చించుకోవడం కనిపించింది. వినాయకుడు వెలసిన ప్రాంతంలోనే గుడి కట్టాలని తుర్కపల్లి వాసులు కోరుకుంటున్నారు. పురావస్తుశాఖ ఈ విగ్రహాలపై పరిశోధనలు చేసి ఏ కాలంనాటి విగ్రహాలో చెప్పాలని స్థానికులు కోరుతున్నారు. సమీప భవిష్యత్ లోనే ఈ ప్రాంతం మరో ప్రఖ్యాత గణపతి సన్నిధానం కానుందని చెబుతున్నారు.

Ganesh Idol

Read also: JC Vs Pedda Reddy: తాడిపత్రి వార్: తాజాగా పెట్టిన కొత్త కేసుపై సంచలన కామెంట్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి