
హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈసారి అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలను చేయాలనుకున్నా శుభ సమయం కోసం చూడాల్సిన అవసరం లేదని.. ఈ రోజున సర్వార్థ సిద్ధి దినంగా పరిగణిస్తారు. అంటే ఈ రోజున చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున, ముఖ్యంగా సూర్యుడిని, లక్ష్మీ దేవి, విష్ణువును పూజిస్తారు, ఇది జీవితంలో సానుకూలత, శ్రేయస్సును తెస్తుంది.
ఈసారి అక్షయ తృతీయ రోజున సర్వార్థ సిద్ధి యోగం, శోభన యోగం, రవి యోగం ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం ఏదైనా పనిని పూర్తి చేయడంలో సహాయపడుతుంది. శోభన యోగం శుభాన్ని సూచిస్తుంది. రవి యోగం పనిలో విజయం, శ్రేయస్సును తెస్తుంది. ఈ మూడు యోగాల కలయిక అక్షయ తృతీయను అత్యంత ఫలవంతమైనదిగా చేస్తుంది. అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా.. ఒక వ్యక్తి లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందుతాడని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు