Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్దులు, దివ్యాంగులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం..తేదీలు ఖరారు!

తిరుమల వెంకటేశుని దర్శనం కోసం ఇకపై వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు.. ఇబ్బంది పడాల్సిన పనిలేదు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. నెలలో రెండు రోజుల పాటు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది. ఈ కార్యక్రమ దిగ్విజయంగా నడుస్తుంది కూడా.  ఇందులోభాగంగా అక్టోబరు 15, 29 తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ […]

వృద్దులు, దివ్యాంగులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం..తేదీలు ఖరారు!
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 10, 2019 | 4:30 PM

తిరుమల వెంకటేశుని దర్శనం కోసం ఇకపై వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు.. ఇబ్బంది పడాల్సిన పనిలేదు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. నెలలో రెండు రోజుల పాటు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది. ఈ కార్యక్రమ దిగ్విజయంగా నడుస్తుంది కూడా.  ఇందులోభాగంగా అక్టోబరు 15, 29 తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ రెండు రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్‌కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు 1,000 టోకెన్లు జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది.

అలాగే ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు అక్టోబరు 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక మీదట ప్రతినెల 2 రోజులు వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.