AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు టార్గెట్‍గా విజయసాయి రెడ్డి ట్వీట్లు!

ఏపీ ఎన్నికల్లో ఏకంగా 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వారినే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టడం చర్చనీయాంశమైంది. అయితే, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఇలాగే కాంగ్రెస్-టీడీపీ కూటమి ట్రక్కు గుర్తుతో అభ్యర్థులను నిలబెట్టి బొక్క బోర్లా పడిందని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, […]

చంద్రబాబు టార్గెట్‍గా విజయసాయి రెడ్డి ట్వీట్లు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2019 | 4:27 PM

Share

ఏపీ ఎన్నికల్లో ఏకంగా 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వారినే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టడం చర్చనీయాంశమైంది. అయితే, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఇలాగే కాంగ్రెస్-టీడీపీ కూటమి ట్రక్కు గుర్తుతో అభ్యర్థులను నిలబెట్టి బొక్క బోర్లా పడిందని ఎద్దేవా చేశారు.

పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, నవీన్ పట్నాయక్, పళని సామి ఏపీని దోచుకోవాలని చూస్తున్నారని గుండెలు బాదుకుంటున్నావు. ఐదేండ్లలో మట్టి, ఇసుకతో పాటు అన్ని వనరులను స్వాహా చేసి రాష్ట్రాన్ని వల్లకాడులా మార్చావు. ఎవరొచ్చినా ఏం మిగిలింది చంద్రబాబూ. ఏడుపు సీన్లు తగ్గించు’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

‘తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమి “ట్రక్కు” గుర్తుతో అభ్యర్థులను నిలబెట్టింది. టీఆరెస్ “కారు” గుర్తును పోలి ఉండటంతో ట్రక్కుకు కూడా ఓట్లు పడ్డాయి. కాని కారు పార్టీనే గెలిచింది.ఏపీలో అదే నీచానికి ఒడిగట్టి కెఎపాల్ “హెలికాప్టర్”తో ఫ్యాన్ కు నష్టం కలిగించాలని చూస్తున్నాడు’ మరో ట్వీట్ పెట్టారు.

‘గడువు దాటినా కెఎ పాల్ భీమవరంలో నామినేషన్ వేసేందుకు వెళ్లడం అంతా చంద్రబాబు స్కెచ్ ప్రకారమే జరిగింది. చివరకు పాల్ కాళ్లు పట్టుకునే స్థితికి దిగిజారిపోయావా బాబూ. అతని గుర్తు, కండువా రంగు, అభ్యర్థుల ఎంపిక అంతా చంద్రబాబే డిసైడ్ చేశారు. భూకంపం వచ్చినపుడు కొండలు కూడా బద్దలవుతాయి’ అని విమర్శించారు.