AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత విజసాయిరెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబుకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తొత్తుగా మారారంటూ మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల బృందం.. డీజీపీ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు విజయసాయి. ఆర్పీ ఠాకూర్ తన వాహనంలో 35కోట్ల రూపాయలు తరలించిన విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకొచ్చామన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. టీడీపీతో కలిసి వైసీపీని దెబ్బతీసేందుకే.. కేఏ పాల్ పార్టీ, తమ పార్టీ అభ్యర్థుల […]

చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత విజసాయిరెడ్డి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2019 | 3:38 PM

Share

ఏపీ సీఎం చంద్రబాబుకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తొత్తుగా మారారంటూ మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల బృందం.. డీజీపీ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు విజయసాయి. ఆర్పీ ఠాకూర్ తన వాహనంలో 35కోట్ల రూపాయలు తరలించిన విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకొచ్చామన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి.

టీడీపీతో కలిసి వైసీపీని దెబ్బతీసేందుకే.. కేఏ పాల్ పార్టీ, తమ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులను నిలబెట్టారన్నారు విజయసాయిరెడ్డి. ఇదే విషయాన్ని మరోసారి ఈసీ దృష్టికి తెచ్చామన్న ఆయన.. హెలికాప్టర్ గుర్తుపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. తమ ఫిర్యాదుపై ఈసీ సానుకూలంగా స్పందించనుందని తెలిపారు విజయసాయి రెడ్డి.