మోహన్‌బాబుపై యామిని తీవ్ర ఆగ్రహం

|

Mar 24, 2019 | 7:20 PM

అమరావతి: మోహన్‌బాబాపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును విమర్శించే అర్హత మోహన్‌బాబుకు లేదన్నారు. ముందు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, మోహన్‌బాబు సినిమా డైలాగులు వినే ఓపిక ఎవ్వరికీ లేదని యామిని అన్నారు. అందరికీ మంచి చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్న చంద్రబాబు గారు లాంటి వ్యక్తి పైన కామెంట్లు చేస్తే ఒక టీడీపీ మాత్రమే కాదు ఏపీలో ఉన్న ఐదున్నర్ర కోట్ల మంది వ్యతిరేకించే […]

మోహన్‌బాబుపై యామిని తీవ్ర ఆగ్రహం
Follow us on

అమరావతి: మోహన్‌బాబాపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును విమర్శించే అర్హత మోహన్‌బాబుకు లేదన్నారు. ముందు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, మోహన్‌బాబు సినిమా డైలాగులు వినే ఓపిక ఎవ్వరికీ లేదని యామిని అన్నారు.

అందరికీ మంచి చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్న చంద్రబాబు గారు లాంటి వ్యక్తి పైన కామెంట్లు చేస్తే ఒక టీడీపీ మాత్రమే కాదు ఏపీలో ఉన్న ఐదున్నర్ర కోట్ల మంది వ్యతిరేకించే పరిస్థితి వస్తుందని యామిని అన్నారు. మీరు మీ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని, మనసున్న ఎవరైనా సరే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే ఊరుకోరని యామిని అన్నారు.