AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ సమర్థవంతమైన నాయకుడు- పీవీపీ, సామినేని

విజయవాడ: విజయవాడ వైసీపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ పార్టీ అధ్యక్షుడు జగన్‌‌మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ కు 25 సంవత్సరాల విజన్ ఉందని, ఆయన లాంటి నాయకుడితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఈరోజు వైసీపీ శ్రేణులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మూడు వారాలు యుద్ధంలాంటి పరిస్థితి అనీ, వైసీపీ కార్యకర్తలు శ్రమించి పనిచేయకుంటే తనతో పాటు జగన్ కూడా ప్రజలు సేవలు అందించలేమని వ్యాఖ్యానించారు. […]

జగన్ సమర్థవంతమైన నాయకుడు- పీవీపీ, సామినేని
Vijay K
| Edited By: |

Updated on: Mar 20, 2019 | 3:16 PM

Share

విజయవాడ: విజయవాడ వైసీపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ పార్టీ అధ్యక్షుడు జగన్‌‌మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ కు 25 సంవత్సరాల విజన్ ఉందని, ఆయన లాంటి నాయకుడితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఈరోజు వైసీపీ శ్రేణులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ మూడు వారాలు యుద్ధంలాంటి పరిస్థితి అనీ, వైసీపీ కార్యకర్తలు శ్రమించి పనిచేయకుంటే తనతో పాటు జగన్ కూడా ప్రజలు సేవలు అందించలేమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లకు జగన్ నవరత్నాలను ప్రకటించారని, ఆయనకు మరో 25 ఏళ్ల విజన్ ఉందని చెప్పారు. చంద్రబాబు పాలనంతా మోసాలు, అన్యాయాలు, దగాయేనని దుయ్యబట్టారు.

జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను మాట్లాడుతూ…జగన్‌మోహన్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరంగా అభివర్ణించారు. వైఎస్సార్ పాలనలో చిరనవ్వు చిందని రైతు మోహం లేదని…కానీ ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రైతులు కన్నీళ్లు, కష్టాలే మిగిలాయని విమర్శించారు. రైతులు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.