సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికిన కత్తులు.. న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణలో కీలక పురోగతి

హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. హత్య కేసు విచారణకు కావాల్సిన కీలక ఆధారాలు..

సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికిన కత్తులు.. న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణలో కీలక పురోగతి
Follow us

|

Updated on: Mar 01, 2021 | 6:23 PM

హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. హత్య కేసు విచారణకు కావాల్సిన కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు ఎట్టకేలకు సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికాయి. బ్యారేజ్‌ 53, 54 పిల్లర్ల వద్దరెండు కత్తులను గజఈతగాళ్లు వెలికి తీశారు. కాగా కత్తుల కోసం పోలీసులు రెండు రోజులు వేట కొనసాగించగా సోమవారం వీరి ప్రయత్రం ఫలించింది.

ఆదివారం రోజు సాయంత్రం వారకు సుందిళ్ల బ్యారేజీలో కత్తుల కోసం గాలించిన పోలీసులు, గజ ఈతగాళ్లు.. రెండో రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం సుందిళ్ల పార్వతి బ్యారేజ్ వద్దకు ఇద్దరు నిందితులను పోలీసులు తీసుకొచ్చారు. అయితే హత్యకు ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో 59 పిల్లర్ వద్ద పడేశామని గురువారం నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి చూపించగా నేడు 45వ పిల్లర్ నుంచి 60వ పిల్లర్ వరకు మధ్యలో పడేశామని మాట మార్చారు

దీంతో కేసులో కత్తులు కీలకంగా మారడంతో పోలీసులు సవాల్‌గా స్వీకరించారు. ఈ క్రమంలో రెండు కత్తుల కోసం అయిదుగరు గజ ఈతగాళ్లతోపాటు 50 మంది పోలీసులు గాలించారు. వీరిలో ముగ్గురు గజఈతగాళ్ళు నీట మునిగి కత్తుల కోసం వెతికారు. పై నుంచి భారీ అయస్కాంతంతో పోలీసుల వెతికారు. చివరికి గజఈతగాళ్లకే కత్తులు లభ్యమయ్యాయి. ఇదిలా ఉండగా ఆరు వందల రూపాయల విలువ చేసే రెండు కత్తుల కోసం రెండు రోజులుగా పోలీసులు హైరానా పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే న్యాయవాదుల హత్య కేసు విచారణలో హత్యకు ఉపయోగించిన కత్తులు కీలకంగా మారాయి. కేసు విచారణలో భాగంగా హత్యలకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో నిందితులను నిన్న పార్వతి బ్యారేజ్‌ వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పిన వివరాల ప్రకారం విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఈరోజు మళ్లీ గాలింపు కొనసాగించారు. ఈసారి పెద్ద అయస్కాంతాల సాయంతో కత్తులను గుర్తించేందుకు శ్రమించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం 59-60 పిల్లర్ల వద్ద నుంచి క్రమంగా 53వ నంబర్‌ పిల్లర్‌ వైపు గాలించగా అక్కడ కత్తి లభ్యమైంది. నీటి ప్రవాహానికి 59 నంబర్‌ పిల్లర్‌ నుంచి 53వ నంబర్‌ పిల్లర్‌ వైపు వెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

కాగా, వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు, సోదరుడు గట్టు ఇంద్రశేఖర్‌లకు రామగుండం పోలీసులు పటిష్ఠ భద్రత కల్పిస్తున్నారు. గుంజపడుగులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్, పెట్రోలింగ్ కొనసాగిస్తున్నారు. తనకు భద్రత కల్పించాలని ఇటీవల ఇనుముల సతీశ్‌ పోలీస్‌శాఖను అభ్యర్థించారు. భద్రత కల్పించేందుకు పోలీసులు సుముఖత వ్యక్తం చేసినా సతీశ్‌ అందుబాటులోకి రాలేదు.

Read more:

కర్ణాటక రైతులు తెలంగాణలో కలుస్తామంటున్నారు.. ఇది టీఆర్‌ఎస్‌ సాధించిన ఘనతన్న మంత్రి హరీశ్‌రావు

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం