మార్చ్ 5న ఆంధ్రప్రదేశ్ బంద్.. సబ్బండ వర్గాలు మద్దతివ్వాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు

ఆంధ్ర ప్రజల మనోభావాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణను వ్యతిరేకిస్తూ..

మార్చ్ 5న ఆంధ్రప్రదేశ్ బంద్.. సబ్బండ వర్గాలు మద్దతివ్వాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు
Follow us

|

Updated on: Mar 01, 2021 | 5:45 PM

ఆంధ్ర ప్రజల మనోభావాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణను వ్యతిరేకిస్తూ మార్చి 5 రాష్ట్ర బంద్ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ సన్నాహక సమావేశం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, TNTUC నగర అధ్యక్షులు గదుల సాయిబాబు, IFTU జిల్లా నాయకులు గుబ్బల ఆదినారాయణ, AICCTU రాష్ట్ర నాయకులు గొడుగు సత్యన్నారాయణ, IFTU జిల్లా నాయకులు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా 2.5 లక్షల కోట్లు సమికరిస్తామని మోడీ ప్రకటన చేయడం బీజేపీ మతోన్మాద, నియంతృత్వ విధానాలకు పరాకాష్టని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజకీయంగా, ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఏ ప్రత్యేకతా లేకుండా చేసి కేంద్రంపై ఆధారపడాలనే కుట్రతోనే ఆంధ్రాబ్యాంక్ కంటే 3 రేట్లు చిన్నదైన యూనియన్ బ్యాంకులో విలీనం చేసారని, ఇప్పుడు రాష్ట్రానికి వన్నె తెచ్చిన నవరత్న హోదా కలిగిన ఏకైక విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రేవేటికరణ ద్వారా నిర్వీర్యం చేయాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో విశాఖ ప్రాంతంలో హిందూస్థాన్ జింక్ పరిశ్రమను నష్టాలొస్తున్నాయని వాజ్ పాయి హయాంలో వేదాంత గ్రూపుకు అమ్మేసారని, 2014లో వేదాంత గ్రూపు పరిశ్రమను పూర్తిగా మూసివేసి 3వేల ఎకరాల పరిశ్రమ భూమిని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటుందని, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములైన 30వేల ఎకరాలను కాజేయడానికే ప్రేవేటికరిస్తున్నారని విమర్శించారు.

నిజంగా నష్టాలనుండి విశాఖ ఉక్కుని బయటపడేయాలంటే సొంత ఘనులు కేటాయిస్తే సరిపోతుందని అన్నారు. 2020లో విశాఖ పరిశ్రమలో పేరుకుపోయిన లక్ష టన్నుల ఐరన్ నిల్వల విలువే 7వేల కోట్లు ఉంటుందని, అలాంటిది 1 లక్ష 50వేల కోట్లు విలువచేసే 30వేల ఎకరాలు భూములు, లక్ష టన్నుల నిల్వలు, లక్ష కోట్ల విలువచేసే యంత్ర పరికరాలు, ఐరన్ వోర్ నిల్వలు మొత్తం కలిపి 6వేల కోట్లకు అమ్మాలని నిర్ణయించటమే దేశంలో అతిపెద్ద అవినీతని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ అవసరాలకు నిధుల సమీకరణ పేరుతో దేశీయ సంస్థలను విదేశీయులకు అమ్ముతూ, మరోపక్క 6ఏళ్లలో 200 కార్పొరేట్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన 9లక్షల కోట్ల ఆదాయపు పన్ను మాఫీచేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. అందుకే కార్పొరేట్ కంపెనీలనుండి బీజేపీ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో విరాళాలు వేలకోట్లు పోగేసుకుంటు అవినీతిని సంస్థాగతం చేస్తుందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం జరిగే మార్చ్ 5 రాష్ట్ర బంద్ కి రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని విజప్తి చేశారు. ఈ బంద్ జయప్రదం కోరుతూ మార్చ్ 2వతేది విస్తృత సమావేశం విశాఖ ఉక్కు పరిరక్షణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్య మేధావులు, సామాజిక ఉద్యమకారులు, దళిత, మైనారిటీ సంఘాలు, జిల్లా ప్రజానీకం, వ్యాపార సంఘాలు, ఆటో, ట్రాన్స్ పోర్ట్ సోదరులు ఈ బంద్ లో స్వచ్చందంగా పాల్గొని ఆంధ్ర ప్రజల స్వాభిమానాన్ని చాటాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు జరిగే పోరాటాలను మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఈ సన్నాహక సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి మాలకా రమణ, ఉపాధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి, నగర ఉపాధ్యక్షులు మెడిశెట్టి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Read more:

పోలవరం ప్రాజెక్టుపై సీఎం కీలక సమీక్ష.. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని అధికారులకు ఆదేశం

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు