జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేస్తోన్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత వారం ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఆయనను.. హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతున్నా కోలుకోవడం లేదు. దీంతో ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి.. ఆపై […]

జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

Edited By:

Updated on: Apr 08, 2019 | 10:12 AM

నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేస్తోన్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత వారం ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఆయనను.. హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతున్నా కోలుకోవడం లేదు. దీంతో ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది.

అయితే 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి.. ఆపై టీడీపీలోకి వెళ్లారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ నిరాకరించడంతో.. జనసేనలో చేరి ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన విషయం తెలిసిందే.