తమిళనాడులో మారుతున్న రాజకీయాలు.. రెండాకుల గుర్తు నాకే కావాలి..  సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించిన శశికళ

|

Feb 03, 2021 | 5:17 PM

తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తు తనకే చెందుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు శశికళ. పార్టీని చేజిక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారామే...

తమిళనాడులో మారుతున్న రాజకీయాలు.. రెండాకుల గుర్తు నాకే కావాలి..  సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించిన శశికళ
Follow us on

Sasikala : తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తు తనకే చెందుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు శశికళ. పార్టీని చేజిక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారామే.

అటు శశికళకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ కి శశికళ సారధ్యం వహించాలని , రానున్న ఎన్నికలలో గెలుపుకోసం శశికళకి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలని ఈ పోస్టర్లు వెలిశాయి. వీటిని సీరియస్ గా తీసుకున్న సీఎం పళనిస్వామి , డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం పోస్టర్లకు కారణమైన వారిని పార్టీ నుంచి బహిష్కరించారు.

ఇక శశికళ, ఆమె తరఫు న్యాయవాదులు అనర్హత వేటు నుంచి తప్పించుకునే మార్గాన్ని అన్వేషిస్తున్నారు. సిక్కిం రాష్ట్రం రవాణాశాఖ మంత్రిగా ప్రేమ్‌సింగ్‌ దమాంగ్‌ అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించారు. 2018లో జైలు నుంచి వచ్చిన ఆయన ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. కానీ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన.. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఈసీ ఆయనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 11 కింద మినహాయింపునిచ్చింది. ఇప్పుడు శశికళ కూడా అదేవిధంగా ఈసీని ఆశ్రయించాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..