AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయ ప్రకటనలపై ఎన్నికల సంఘం ఆంక్షలు

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చివరి రెండు రోజులు చేసే రాజకీయ ప్రకటనలపై ఈసీ గైడ్‌లైన్స్ ప్రకటించింది. ఏడు విడతలుగా జరుగనున్న ఈ ఎన్నికల్లో.. ప్రతి విడత పోలింగ్ రోజుతోపాటు ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీలు ధ్రువీకరించని యాడ్స్‌ను ప్రచురించకుండా ఈసీ నిషేధం విధించింది. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. అయితే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే […]

రాజకీయ ప్రకటనలపై ఎన్నికల సంఘం ఆంక్షలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 07, 2019 | 11:53 AM

Share

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చివరి రెండు రోజులు చేసే రాజకీయ ప్రకటనలపై ఈసీ గైడ్‌లైన్స్ ప్రకటించింది. ఏడు విడతలుగా జరుగనున్న ఈ ఎన్నికల్లో.. ప్రతి విడత పోలింగ్ రోజుతోపాటు ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీలు ధ్రువీకరించని యాడ్స్‌ను ప్రచురించకుండా ఈసీ నిషేధం విధించింది. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.

అయితే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే ఈసీ తొలిసారి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది. పోలింగ్ రోజు, ఆ ముందు రోజు రాజకీయ ప్రకటనలను ప్రచురించకుండా నిషేధం విధించాలని ఈసీ ప్రతిపాదించింది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రతిపాదన న్యాయ శాఖ ముందు పెండింగ్‌లో ఉన్నది. ఎన్నికల చివరి దశలో ప్రచురించే ప్రకటనలు స్వభావరీత్యా దురుద్దేశపూరితమైనవిగా, ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉంటున్నట్టు గతంలో తమ దృష్టికి వచ్చిందని ఈసీ పేర్కొంది. ఇటువంటి ప్రకటనల వలన మొత్తం ఎన్నికల ప్రక్రియకే దెబ్బ తగులుతున్నదని, అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు వివరణ ఇచ్చేందుకు, లేదా ఆరోపణలను తోసిపుచ్చేందుకు అవకాశం ఉండదని ఈసీ తెలిపింది. విద్వేషపూరితమైన లేదా రెచ్చగొట్టే ప్రకటనల వల్ల అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిరోధించేందుకు వీలుగా అన్ని దశల్లోనూ పోలింగ్ రోజు, ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీలు సర్టిఫై చేయని రాజకీయ ప్రకటనల ప్రచురణపై నిషేధం విధించామని ఈసీ స్పష్టం చేసింది.

ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..