AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి వృక్షార్చన కార్యక్రమం అందుకే చేపట్టాం.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేసిన సంతోష్ కుమార్

ప్రకృతి, పచ్చదనం అవసరం బాగా తెలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్నారు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. అందుకే రాష్ట్రం ఏర్పాటైన..

కోటి వృక్షార్చన కార్యక్రమం అందుకే చేపట్టాం.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేసిన సంతోష్ కుమార్
K Sammaiah
|

Updated on: Feb 16, 2021 | 3:34 PM

Share

ప్రకృతి, పచ్చదనం అవసరం బాగా తెలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్నారు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. అందుకే రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే తెలంగాణకు హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారని తెలిపారు. ఆరేళ్ల హరితహరం, మూడేళ్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సందర్బంగా సీఎం పుట్టిన రోజు నాడు(ఫిబ్రవరి -17) హరిత కానుక ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కోటి వృక్షార్చన చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కోటి వృక్షార్చనలో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణీకులకు వెయ్యి (1,000) ఔషధ మొక్కలు పంపిణీ చేశారు.

బుధవారం జరిగే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని స్వచ్ఛందంగా మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. కొచ్చిన్ నుంచి ఎయిర్ పోర్టుకు వచ్చిన శ్రీనివాస్, సుమలత దంపతులు మొదటి మొక్కను అందుకున్నారు. పంజాబ్ నుంచి వచ్చిన అరుణ్ గుప్తా, సీమా గుప్తా, ముంబై నుంచి వచ్చిన చిన్నారులు ఆర్యా, జహార్ లు మొక్కలను అందుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున తీసుకున్న మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రయాణీకులు ప్రశంసించారు. తమకు ఇచ్చిన మొక్కలను ప్రేమతో పెంచుకుంటామని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణీకులు ముఖ్యమంత్రికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ పోర్టు సీఈఓ ప్రదీప్ పానేకర్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా తాము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్నామని, పచ్చదనం కోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా ఎయిర్ పోర్టు పరిసరాల్లో ప్రతీ యేటా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎం.కే.సింగ్, ఏవియేషన్ డైరెక్టర్ వీ.ఎన్. భరత్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి కరుణాకర్, రాఘవ, విమానాశ్రయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more:

స్పీకర్‌ కోర్టుకు చేరిన గంటా రాజీనామా బాల్‌.. రాజీనామా ట్విస్టులకు ఫుల్‌ స్టాప్‌ పెడతారా..? డ్రామా కంటిన్యూ అవుతుందా..?

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ