టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్లోని సారంగాపూర్ హనుమంతుడిని దర్శించుకున్నారు. నామినేషన్ వేసే ముందు కవిత తన భర్త అనిల్తో కలిసి ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. నామినేషనల్ పత్రాలను హనుమంతుని పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సుమనారెడ్డి, నాయకులు ఈగ గంగారెడ్డి, మోహన్రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Visited Sarangapur Hanuman temple before nomination and prayed for a prosperous future for all. #JaiNizamabad #JaiTelangana pic.twitter.com/trtCPP4yyJ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2019