AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమే.. స్పష్టం చేసిన కేటీఆర్

వరంగల్ : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమేనని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ తమతో కలిసి పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారందరి మద్దతుతో 150 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని.. ఆ బలంతో కేంద్రాన్ని శాసించే స్థాయికి ఫెడరల్ ఫ్రంట్ ఎదుగుతుందని అన్నారు. జిల్లాలోని నర్సంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు […]

జగన్ కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమే.. స్పష్టం చేసిన కేటీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2019 | 6:05 PM

Share

వరంగల్ : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమేనని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ తమతో కలిసి పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారందరి మద్దతుతో 150 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని.. ఆ బలంతో కేంద్రాన్ని శాసించే స్థాయికి ఫెడరల్ ఫ్రంట్ ఎదుగుతుందని అన్నారు. జిల్లాలోని నర్సంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేకు 150 నుంచి 160కు మించి సీట్లు రావని.. ఇక కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి కూడా లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై వ్యతిరేకత ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని అన్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ప్రజల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు.