సతీమణితో కలిసి దీక్షకు దిగనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

| Edited By: Srinu

Mar 06, 2019 | 9:10 PM

హైదరాబాద్: సింగూరు జలాల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన భార్యతో కలిసి దీక్షకు దిగనున్నారు.ఈ నెల 18న తన భార్య నిర్మలతో కలిసి దీక్ష చేయనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. సింగూరు నీళ్ల కోసం తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సింగూరు జలాలపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ జీవో లేకుండా నీళ్లు తరలించడం అక్రమమని మండిపడ్డారు. నీటి తరలింపునకు కారణం […]

సతీమణితో కలిసి దీక్షకు దిగనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Follow us on

హైదరాబాద్: సింగూరు జలాల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన భార్యతో కలిసి దీక్షకు దిగనున్నారు.ఈ నెల 18న తన భార్య నిర్మలతో కలిసి దీక్ష చేయనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. సింగూరు నీళ్ల కోసం తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సింగూరు జలాలపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ జీవో లేకుండా నీళ్లు తరలించడం అక్రమమని మండిపడ్డారు. నీటి తరలింపునకు కారణం హరీష్‌రావే అని ఆయన ఆరోపించారు. సింగూరును తన జాగీరులా హరీష్‌ వ్యవహరించారని దుయ్యబట్టారు. సింగూరు డ్యామ్‌ని నింపుతామన్న సీఎం తన మాట నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.