ఫేక్ సర్వేలతో జాగ్రత్త – వైఎస్ జగన్

|

Mar 22, 2019 | 8:07 PM

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండగా.. కొన్ని ఫేక్ సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సర్వేలు వచ్చాయి కానీ ఇది మాత్రం ఫేక్ సర్వే అని తెలిసిపోతోంది. ఇప్పటికే కొన్ని జాతీయ సర్వేల్లో వైస్సార్సీపీదే విజయం అని తేల్చేశాయి. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల్లో మరింత చేరువయ్యారని.. 2014తో పోలిస్తే ఈసారి ఓట్లు శాతం, సీట్లు పెరిగే అవకాశం ఉందని అవి చెబుతున్నాయి. కానీ ఇక్కడ ఒక ఫేక్ సర్వే జగన్ కు సీట్లు, ఓట్లు […]

ఫేక్ సర్వేలతో జాగ్రత్త - వైఎస్ జగన్
Follow us on

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండగా.. కొన్ని ఫేక్ సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సర్వేలు వచ్చాయి కానీ ఇది మాత్రం ఫేక్ సర్వే అని తెలిసిపోతోంది. ఇప్పటికే కొన్ని జాతీయ సర్వేల్లో వైస్సార్సీపీదే విజయం అని తేల్చేశాయి. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల్లో మరింత చేరువయ్యారని.. 2014తో పోలిస్తే ఈసారి ఓట్లు శాతం, సీట్లు పెరిగే అవకాశం ఉందని అవి చెబుతున్నాయి.

కానీ ఇక్కడ ఒక ఫేక్ సర్వే జగన్ కు సీట్లు, ఓట్లు శాతం ఈసారి బాగా తగ్గుతుందని చెబుతోంది. ఫేక్ సర్వే ఏమి చెబుతోందంటే.. టీడీపీకి 45.8%, వైఎస్సార్సీపీకి 37.6%, జనసేనకు 12.5% వస్తాయట. అసలే ప్రజల్లో అధికారక టీడీపీ మీద కొన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఈ ఫేక్ సర్వే టీడీపీకి ఎక్కువ, జగన్ కు 2014లో కంటే తక్కువగా సీట్లు వస్తాయని చెబుతోంది. ఇది చూస్తుంటే ఖచ్చితంగా ఎల్లో మీడియా లేదా మరెవరో కావాలని వదిలిన సర్వేలా ఉంది.

మరోవైపు సర్వేలు ఎవరైనా చేయవచ్చు. కానీ మరీ ఇంత ఘోరంగా ప్రజలు నమ్ముతారో లేదో అని తెలుసుకోకుండా వదిలేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు. కానీ జగన్ కు మాత్రం ఈసారి ఓట్లు. సీట్ల శాతం మునుపటి కంటే ఎక్కువగా వస్తాయని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా ఇలాంటిదే ఒక సర్వే అప్పట్లో తెలంగాణ ఎన్నికల టైం లో హల్ చల్ చేసింది. కానీ చివరికి ఏమైంది కేసీఆర్ సంచలన మెజారిటీతో గెలిచారు. సో ప్రజలు ఇటువంటి సర్వేలతో తస్మాత్ జాగ్రత్త.