ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఆయన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 27 నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ […]

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది

Updated on: Mar 18, 2019 | 11:04 AM

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఆయన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది.

26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 27 నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ నిర్వహించి, మే 23న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కలెక్టర్లుకు ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ అందరి అభ్యర్ధుల పేర్లను ప్రకటించగా.. టీడీపీ, బీజేపీ మరికొందరి పేర్లను ప్రకటించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్ధులెవరినీ ఇంకా ప్రకటించలేదు.

Follow Us