AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగ్గులేకుండా దాడి చేస్తున్నాయి: చంద్రబాబు

విజయవాడ: టీడీపీ ప్రవేశపెడుతున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీపై ఫామ్-7 కుట్రలకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీని దొంగదారిన దెబ్బ తీయాలని చూస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఓడిపోతే రాష్ట్రం కేసీఆర్‌కు సామంత రాజ్యంగా మారుతుంది. ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో ఏపీలో బీహార్ తరహా బందిపోటు రాజకీయాలు చేస్తున్నారు. ఏపీపై వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్‌లు కలిసి సిగ్గులేకుండా దాడి చేస్తున్నాయంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి […]

సిగ్గులేకుండా దాడి చేస్తున్నాయి: చంద్రబాబు
Vijay K
|

Updated on: Mar 07, 2019 | 5:42 PM

Share

విజయవాడ: టీడీపీ ప్రవేశపెడుతున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీపై ఫామ్-7 కుట్రలకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీని దొంగదారిన దెబ్బ తీయాలని చూస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఓడిపోతే రాష్ట్రం కేసీఆర్‌కు సామంత రాజ్యంగా మారుతుంది. ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో ఏపీలో బీహార్ తరహా బందిపోటు రాజకీయాలు చేస్తున్నారు.

ఏపీపై వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్‌లు కలిసి సిగ్గులేకుండా దాడి చేస్తున్నాయంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రాణాలైనా ఇస్తానని, వీళ్ల కుట్రలను ప్రజలు అర్ధం చేసుకుంటే చాలని అన్నారు. కేసుల పేరుతో ఇబ్బంది పెడుతున్న వాల్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో మరొకటి ఇస్తారో ఇచ్చుకోండంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us