AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ గాంధీపై అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు

‘ఆమ్ ఆద్మీ పార్టీ… కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు విఫలమవడానికి కారణం రాహుల్ గాంధీ’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో పార్టీ మానిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినట్లయితే దానికి కారణం కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రమే అని కేజ్రీవాల్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గత వారం రాహుల్ గాంధీ ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా […]

రాహుల్ గాంధీపై అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2019 | 7:29 PM

Share

‘ఆమ్ ఆద్మీ పార్టీ… కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు విఫలమవడానికి కారణం రాహుల్ గాంధీ’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో పార్టీ మానిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినట్లయితే దానికి కారణం కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రమే అని కేజ్రీవాల్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గత వారం రాహుల్ గాంధీ ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ద్వయాన్ని అడ్డుకునేందుకు తాము ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాము ఏ ‘మహాకూటమి’ ప్రభుత్వానికైనా మద్దతిస్తామన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. మోదీ మరియు (బిజెపి అధ్యక్షుడు అమిత్) షా తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే… దానికి బాధ్యత రాహుల్ గాంధీదే అని కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు. ఈ వారం, ఢిల్లీలోని ఏడుగురు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను నియమించింది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఉంటే బిజెపిని దెబ్బతీయొచ్చు అని కెజ్రీవాల్ పేర్కొన్నారు.

ఢిల్లీలో ఏడు సీట్లను గెలుచుకోవాలంటే కాంగ్రెస్ సహాయం అవసరం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సూచించింది. సీట్ల షేరింగ్ ఒప్పందం ద్వారా హర్యానాలోనూ, పంజాబ్లోనూ బిజెపిని పరిమితం చేయదానికి ఆ ఒప్పందం సహకరిస్తుందని ఆప్ పేర్కొంది. మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయి. కానీ అది సాధ్యపడలేదు.

మే 12 వ తేదీన ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే 23 న ఫలితాలు ప్రకటించబడుతాయి.