ఓరుగల్లు ఒడిలో ప్రపంచ అందం..పట్టుపరికిణీల్లో అందాల తారలను చూశారా..
ఓరుగల్లు ఒడిలోకి ప్రపంచ అందం చేరింది.. ప్రపంచ సుందరీమణుల సందడితో వరంగల్ జిల్లా మురిసిపోయింది.పట్టు పరికిణీల్లో అందంగా ముస్తాబై ముద్దుగుమ్మలు దేవాలయ దర్శనాల్లో పాల్గొన్నరు. అచ్చం తెలుగు అమ్మాయిల్లా రెడీ అయ్యి భారతీయ సంస్కృతి సంప్రదాయలను వెలుగెత్తిచాటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కాగా, మీరు కూడా ఈ అందమైన ఫొటోలపై ఓ లుక్ వేయండి.
Updated on: May 15, 2025 | 11:00 AM

హెరిటేజ్ వాక్లో భాగంగా ప్రపంచ అందాల ముద్దుగుమ్మలు వరంగల్ జిల్లాలో జిగేల్ మన్నారు. అచ్చం తెలుగు అమ్మాయిల్లా రెడీ అయ్యి తెలుగుదనం ఉట్టిపడేలా నొదుటన తిలకం, సిగలో పూలతో అందంగా కనిపించారు. మొత్తం 57 మంది మిస్ వరల్డ్ బ్యూటీలు రెండు గ్రూప్లుగా వరంగల్ జిల్లాలో పర్యటించారు.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ బ్యూటీలకు స్వాగతం పలికారు. డోలు, బతుకమ్మలోల+తో వీరిని వరంగల్ జిల్లాలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా ఈ సుందరాంగులు బతుకమ్మ వద్ద నృత్యాలు చేయడమే కాకుండా, డోలు చపుడుకు డ్యాన్స్లు చేస్తూ సందడి చేశారు .

మొదట వేయి స్తంభాల గుడికి వెళ్లి అక్కడ నందీశ్వరుడికి పూజలు చేశారు. శివలింగానికి అభిషేకం చేసి ఓ నమశివాయ అంటూ దేవుడిని ప్రార్థించి, గుడిలో సెల్ఫీలకు ఫోజులిచ్చారు.

అంతేకాకుండా తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రామప్ప ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయ విశిష్టత , కాకతీయుల చరిత్ర గురించి చాలా విషయాలను తెలుసుకున్నారు.

అదే విధంగా ఈ అందాల సుందరీమణులు వరంగల్ కోట, ఇలా జిల్లాలోని అన్నిపర్యాటక ప్రదేశాలను సందర్శించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.



