Ugadi 2025: ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం.. డబ్బే డబ్బు..!
తెలుగు ప్రజలు ఎంతో ప్రీతిగా జరుపుకునే ఉగాది పండుగ ఈ సంవత్సరం మార్చి 30న రాబోతుంది. ఈ పండుగ తర్వాత గ్రహాల స్థానాలు మారడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది. వాళ్లకు విపరీతమైన అదృష్టం కలిగి అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వృషభ, మిధున, సింహ, తులా, ధనుస్సు, మీన రాశుల వారికి ఇది మంచి కాలం.
Updated on: Mar 19, 2025 | 9:24 PM

వృషభ రాశి.. ఉగాది తర్వాత వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారు ఏ పని చేసినా అదృష్టం వారిని అనుకూలంగా నిలబెడుతుంది. అన్నింట్లోనూ వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మిధున రాశి.. మిధున రాశి వారికి ఈ పండుగ తర్వాత ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగై, ఆకస్మికంగా లాభాలు రావచ్చు. సంతోషాన్ని ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ కాలం వీరికి అనుకూలించి, మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది.

సింహ రాశి.. ఈ కాలంలో సింహ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. స్వీయ ఆవిష్కరణకు ఇది మంచి సమయం. సింహ రాశి వారు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది.

తులా రాశి.. తులా రాశి వారు ఈ సమయంలో ఊహించని అదృష్టం పొందుతారు. ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి ఈ సమయం అదృష్టం తెస్తుంది. వ్యాపారాలు చేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఇది వారికి మంచి కాలం. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి.

మీన రాశి.. ఉగాది తర్వాత మీన రాశి వారికి అన్ని పనుల్లో విజయాలు వస్తాయి. వారు కన్న కలలు నెరవేరుతాయి. ఆధ్యాత్మికంగా కూడా వీరికి ఎదుగుదల ఉంటుంది.





























