Diabetes care: మధుమేహం ఉన్నవారు తప్పక తినాల్సినవి.. ఇవి బ్లడ్లో షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుతాయి..
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, అంధత్వం మొదలైన వాటి ప్రమాదాన్ని పెంచుతుంది
Updated on: Aug 19, 2021 | 8:41 PM

ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు మార్చుకోక తప్పదు. కష్టమైనా సరే కొన్ని తినాల్సి వస్తుంది. ఏది పడితే అది తిని ఏరికోరి ఆరోగ్య సమయాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇక డయాబెటిక్ పేషంట్స్ ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.లేదంటే గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, అంధత్వం మొదలైన వాటి ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించే ఆహారాలను కూడా మీరు తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వేపలో ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, ట్రైటెర్పెనాయిడ్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి గ్లూకోజ్ అణచివేయడంలో సహాయపడతాయి. మీరు రోజుకు రెండుసార్లు పొడి రూపంలో వేపను తీసుకోవచ్చు గరిష్ట ప్రయోజనాల కోసం టీ, నీరు లేదా ఆహారంలో చేర్చుకోండి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చరాటిన్, మోమోర్డిసిన్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

పురాతన కాలం నుంచి ప్రతి భారతీయ వంటగదిలో అల్లం కనిపిస్తుంది. ఇది లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించడంలో ఇది చాలా ప్రభావవంతమైనది.

చక్కెరను నియంత్రించడానికి నేరేడు పండు చాలా మంచిది. నేరేడులో జామోబోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని విత్తనాలలో జాంబోలిన్ ఎక్కువగా ఉంటుంది.

శరీరంలో గ్లూకోస్ టాలరెన్స్ మెరుగుపరచడంలో మెంతి కూర సహాయపడుతుంది. ఇందులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.





























