
బిజినెస్ మ్యాన్.. ముకేష్ అంబానీ, నీతా అంబానీల గురించి స్పెష్పల్గా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి బాగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ముకేష్, నీతా అంబానీల చిన్న కుమారిడి పెళ్లి హడావిడిలో ఉన్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల మ్యారేజ్ త్వరలోనే జరగనుంది. వీరి వివాహానికి సంబంధించిన మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి.

వీరి వివాహం సంగతి పక్కన పెడితే.. చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ ఉండే ఉంటాయి. వీరు ఏం తింటారు? వీరి ఫేవరేట్ ఫుడ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. మోస్ట్ పాపులర్ అండ్ పవర్ ఫుల్ కపుల్ అయినా ముకేష్ - నీతా అంబానీల జంట.. దక్షిణాది వంటలు అంటే చాలా ఇష్టంగా తింటారంటే. ప్రతి ఆదివారం వారి బ్రేక్ ఫాస్ట్లో ఇడ్టీ సాంబార్ ఉండాలంట.

అంతే కాకుండా ముకేష్.. ప్రతి రోజూ డిన్నర్లో గుజరాతీ స్టైల్ పప్పును తింటారట. ఆయను ఈ స్టైల్లో చేసే పప్పు అంటే చాలా ఇష్టమట. అంతే కాకుండా ముఖేష్, నీతా అంబానీలు ఎక్కువగా ఇంట్లో ఫుడ్ తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారట.

ఈ భోజనం కూడా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకుంటారట. పలువురు ప్రముఖ చెఫ్లు అంబానీ ఇంట్లోనే ఉంటారు. అంతే కాకుండా వారి ఆహారంలో కాయ ధాన్యాలు ఉండేలా తమ ఆహారంలో భాగం అయ్యేలా చూసుకుంటారట.

అంతే కాకుండా నీతా, ముకేష్ అంబానీలు స్ట్రీట్ ఫుడ్ తినేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారట. ముఖ్యంగా దహీ బటాటా పూరీ, బేల్ పూరీలను తీసుకుంటారట. ముకేష్ అంబానీకి ప్రతీ రోజూ సాయంత్రం స్నాక్స్లో సేవ్ పూరీ తీసుకుంటారట. అది కూడా టీ కాంబినేషన్లో తీసుకోవడం ఇష్టమట.