
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రెడ్మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. రెడ్మీ 13సీ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్ను డిసెంబర్ 6వ తేదీన మార్కెట్లోకి తీసుకురానున్నారు.

ఇక రెడ్మీ 13 సీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 50 మగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన కెమెరా దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ను స్టార్డస్ట్ బ్లాక్, స్టార్షైన్ గ్రీన్ కలర్స్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 9,500గా ఉండొచ్చని అంచనా.

రెడ్మీ 12సీకి కొనసాగింపుగా తీసుకురానున్న ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ99 ఎస్ఓసీ ప్రాసెసర్ను అందించారు. 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 6.74 ఇంచెస్తో కూడిన హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను ఇచ్చారు. 90 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ పనిచేయనుంది.