- Telugu News Photo Gallery Technology photos Do you know how many smartphones were released in the month of May? top smart phones are here
Smart Phones: మే నెలలో స్మార్ట్ ఫోన్ల జాతరే.. ఎన్ని ఫోన్లు రిలీజ్ అయ్యాయో తెలుసా?
భారతదేశం స్మార్ట్ ఫోన్ మార్కెట్కు స్వర్గధామంలా మారింది. అమెరికా, చైనా తర్వాత స్మార్ట్ ఫోన్లు భారత్లోనే ఎక్కువ అమ్ముడవుతున్నాయి. దీంతో అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారతదేశంలో కొత్త కొత్త మోడల్స్లో స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో టాప్ కంపెనీలన్నీ కొత్త మోడల్ ఫోన్లతో క్యూ కట్టేశాయి. హై బడ్జెట్ ఫోన్ నుంచి మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫోన్ల వరకూ అన్నీఈ నెలలోనే రిలీజ్ అయ్యాయి. గూగుల్, పోకో, రియల్ మీ, రెడ్ మీ వంటి కంపెనీలు తాజాగా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మన ముందుకు వచ్చాయి. ఫీచర్లు డిజైన్లపరంగా కూడా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్లు ఇంకా భారతదేశంలో అధికారికంగా లాంచ్ కాలేదు. కానీ భవిష్యత్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మే నెలలో రిలీజ్ అయిన టాప్ ఫోన్లపై ఓ లుక్కేద్దాం.
Updated on: May 19, 2023 | 10:30 AM

గూగుల్ పిక్సెల్ 7ఏ: ఈ నెలలో రిలీజ్ అయిన ఈ ఫోన్ రూ.43,000కు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓ ఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చే ఈ ఫోన్ 64 ఎంపీ ప్రైమరీతో కెమెరా ఆకర్షణీయంగా ఉంటుంది. 4300 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ క్యూఐ వైర్ లెస్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.

పోకో ఎఫ్ 5: 6.67 అంగుళాల ఎమోఎల్ఈడీతో వచ్చే ఈ ఫోన్ 8జీబీ+128 జీబీ, 12 జీబీ+256 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 + జెన్2 చిప్ సెట్తో పని చేస్తుంది. అలాగే 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ ఆకర్షణీయంగా ఉంది.

ఫోకో ఎఫ్ 5 ప్రో: ఈ నెలలోనే రిలీజ్ చేసిన ఈ ఫోన్ కూడా 8 జీబీ+ 256 జీబీ, 12 జీబీ+512 వెరియంట్లల్లో అందుబాటులో ఉంటుంది. 6.67 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్ప్లేతో, 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ ఫోన్ రానుంది. 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు స్నాప్ డ్రాగన్ 8 + జెన్1 చిప్సెట్తో పని చేస్తుంది.

రియల్ మీ 11 సిరస్: ఈ రియల్ మీ సిరీస్లో మూడు ఫోన్లు ఉన్నాయి, రియల్ మీ 11, 11 ప్రో, 11 ప్రో ప్లస్. ఇందులో 11 ప్రో ప్లస్ 200 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఆకర్షణీయంగా ఉంది. ఈ మూడు ఫోన్లు 6.7 అంగుళాల డిస్ప్లేతో వస్తున్నాయి. అయితే ఈ ఫోన్లు అధికారికంగా భారతదేశంలో రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఈ ఫోన్లు చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రియల్ 11 ధర రూ.19,000 నుంచి రూ.21,400, రియల్ మీ 11 ప్రో ధర రూ.23,700 నుంచి రూ.27,300, 11 ప్రో ప్లస్ ధర రూ.28,500 నుంచి రూ.33,200 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

గూగుల్ పిక్సెల్ ఫోల్డ్: 5.8 అంగుళాల ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లేతో పాటు వచ్చే ఈ ఫోన్ 7.6 అంగుళాల ప్రైమరీ ఓ ఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. టెన్సర్ జీ2 చిప్సెట్తో పని చేసే ఈ ఫోన్ రెండు స్క్రీన్స్లో 8.3 ఎంపీ కెమెరాలతో వస్తుంది. అలాగే 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 4800 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ ధర రూ. 1,47,000 ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రెడ్మీ నోట్ 12 ఎస్: 8 జీబీ+256 జీబీ వేరియంట్తో వచ్చే ఈ ఫోన్ ధర దాదాపు రూ.29,500 ఉంటుంది. 6.43 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎమోఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చే ఈ ఫోన్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. మీడియా టెక్ హీలియో జీ 96 చిప్సెట్తో పని చేసే ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.




