India Vs England 2021: రెండు వన్డేలకు శ్రేయస్ దూరం.. 5-6 వారాలు రెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్ ఎవరు..?
ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు మిడిలార్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వెంటనే రాబోయే ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాప్టల్స్ కు కెప్టెన్ ఎవరు...?
గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్లకు మిడిలార్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది. మార్చి 23 న పూణేలో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో తొలి మ్యాచ్లో ఫీల్డింగ్ సమయంలో అయ్యర్కు గాయమైంది. ఎడమ భుజానికి గాయం కావడంతో అయ్యర్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేయలేకపోయాడు. ఈ గాయం కారణంగా, అయ్యర్ సుమారు 5-6 వారాల పాటు మైదానానికి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.
1 / 7
సూర్యకుమార్ యాదవ్
2 / 7
రిషబ్ పంత్
3 / 7
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ విషయానికొస్తే, గత సీజన్లో కూడా కొన్ని మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన ఈ పాత్ర కోసం శిఖర్ ధావన్ ఇప్పటికే ఉన్నారు.
4 / 7
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా వెటరన్ స్టీవ్ స్మిత్ కూడా కెప్టెన్సీ పోటీలో ఉన్నాడు. గతంలో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా స్మిత్ వ్యవహరించాడు.
5 / 7
శిఖర్ ధావన్ తర్వాత స్థానంలో అజింక్య రహానె ఉన్నాడు. రహానే మంచి కెప్టెన్.. రాజస్థాన్ రాయల్స్కు నాయకత్వం వహించిన అనుభవం ఉంది.
6 / 7
ఈ జాబితాలో ముఖ్యమైన పేరు రవిచంద్రన్ అశ్విన్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్ళలో అశ్విన్ కూడా ఉన్నాడు. ఐపీఎల్లో పంజాబ్కు కెప్టెన్గా అనుభవం ఉన్నవాడు.