
పావగఢ్ ఆలయం గుజరాత్లోని అతిపెద్ద పర్యాటక, పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం 3.5 వేల అడుగుల ఎత్తులో ఉంది.

గుజరాత్ ఆహారం భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఆహారం మాత్రమే కాదు పర్వతంపై నిర్మించిన కాళిక దేవి ఆలయం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం దాడి జరిగింది. 51 శక్తిపీఠాలలో ఒకటి.

ఈ ఆలయం 10వ లేదా 11వ శతాబ్దాల మధ్య నిర్మించబడిందని నమ్ముతారు. కాళీమాత అమ్మవారిని సుమారు 3500 అడుగుల ఎత్తులో ఆవిష్కరించారు. ఈ ఆలయంలోకి అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

ఈ ఆలయ శిఖరాన్ని సుమారు 500 సంవత్సరాల క్రితం సుల్తాన్ మహమూద్ బెగడ ధ్వంసం చేశాడు. అయితే పురాతన ఆలయాల పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పావగడ కొండపై ఉన్న ఈ 11వ శతాబ్దపు ఆలయ శిఖరాన్ని పునరుద్ధరించారు.

ఈ ఆలయంలో అత్యంత విశిష్టత ఏమిటంటే, దాదాపు 2000 మంది భక్తులు ఒకేసారి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి భారీగా భక్తులు చేరుకుంటారు.

ఈ పర్వతంపై ఉన్న ఆలయాన్ని రోప్వే లేదా మెట్ల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఒక రాతిపై ఉంది. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికీ భక్తికి కేంద్రంగా విలసిల్లుతుంది.