Gayatri Mantra: చేతులు, కాళ్లతో గాయత్రీ మంత్రాన్ని రాసిన 3315 మంది దివ్యాంగ చిన్నారులు.. సీఎం ప్రశంల వర్షం..
తాము చేపట్టిన పనిని విజయవంతం చేయాలనే సంకల్పంతో కృషి పట్టుదలతో పని చేస్తే.. సాధించలేనిది ఏముంది అని నిరూపించారు కొంతమంది దివ్యాంగ చిన్నారులు. తమకు దేవుడిచ్చిన అవయవ లోపాన్ని అధిగమించి గాయత్రీ మంత్రాన్ని చేతులతో, కాళ్లతో రాసి ప్రపంచ రికార్డ్ సృష్టించారు కొంతమంది చిన్నారులు. త్రివిధ సాధనతో ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ సారధ్యంలో చరిత్ర సృష్టించారు దివ్యాంగులు. ఈ కార్యక్రమంలో సుమారు 3315 మంది వికలాంగ పిల్లలు ఉత్సాహంతో పాల్గొని.. తమ చేతులు, కాళ్లతో గాయత్రీ మంత్రాన్ని రాశారు.
Most Read Stories