
సాధారణంగా వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడల్లా.. శరీరంలో కూడా అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తాయి. బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు కూడా జ్వరం వస్తుంది.

జ్వరం రాగానే చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదంటే డాక్టర్ల దగ్గరకు పరిగెడుతూ ఉంటారు. కానీ ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే జ్వరం పరార్ అయిపోతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు తేనె తీసుకోండి. తేనెలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బలపరిచి.. జ్వరాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇది యాంటీ బయోటిక్ా పని చేస్తుంది.

జ్వరం నుంచి తొందరగా కోలుకోవాలంటే వెల్లుల్లి తీసుకోండి. వెల్లుల్లిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కూడా యాంటీ బయోటిక్లా పని చేస్తుంది. ఇన్ఫెక్షన్లు త్వరగా రాకుండా పోరాడుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్.. శరీరంలో ఉండే బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది.

అదే విధంగా జ్వరాన్ని త్వరగా తగ్గించడంలో అల్లం, పసుపు కూడా ఎంతో ఎఫెక్టీవ్గా పని చేస్తాయి. జ్వరం తగ్గాలంటే అల్లంతో చేసిన ఆహారాలు, పసుపు నీళ్లు తాగుతూ ఉండండి. ఇవి త్వరగా రోగాల బారి నుండి కాపాడతాయి.