
మే 18న కుంబ రాశిలోకి రాహువు సంచారం చేయనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చాలా కలిసి వస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుండనుంది. అంతే కాకుండా ఏ పని చేసినా విజయం వీరి సొంతం అవుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మేష రాశి వారికి రాహువు సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి త్వరలోనే సంబంధం సెట్ అయ్యి, పెళ్లి జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ర్యాంక్ తో పాస్ అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోంగం దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంటుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి వారికి కుంభ రాశిలోకి రాహువు సంచారంతో పట్టిందల్లా బంగారమే కానుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ధన లాభం ఉంది, కుటుంబంలో ఆనందకరవాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. రాని బాకీలు వసూలు అవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి.

కర్కాటక రాశివారికి రాహువు సంచారంతో అనేక లాభాలు ఉన్నాయి. ఈ రాశి వారు దైవ దర్శనం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఎందులో పెట్టుబడి పెట్టినా, వీరికి కలిసి వస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.

ధనస్సు రాశి వారికి రాహువు అదృష్టం తీసుకొస్తున్నారనే చెప్పాలి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ అద్భుతంగా ఉండబోతుంది. ఏ పని చేసినా విజయం మీ సొంతం అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి నిర్మాణం చేపట్టాలి అనుకునే వారి కల నిజం అవుతుంది. ఆదాయం బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.