తయారుచేసుకున్న పిండి ముద్దలో నుండి చిన్న ఉసిరికాయ సైజు అంత పిండిని పాయసం చిక్కబడటానికి పక్కన పెట్టాలి. మిగిలిన పిండిని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. జంతికల మెషిన్ లేకపోతే, కొద్దికొద్దిగా పిండిని తీసుకుని చెక్కపై లేదా ప్లేట్పై చిన్నగా, సన్నగా తాలికల్లా ఒత్తుకోవచ్చు.ఒక వెడల్పాటి కడాయిలో రెండు కప్పుల నీళ్లు వేసి వేడి చేయాలి. నీళ్లు కొంచెం వేడెక్కగానే నానబెట్టిన సగ్గుబియ్యం వేసి నాలుగు ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు నాలుగు కప్పుల పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు, జంతికల గొట్టంతో తాలికలను నేరుగా పాలలోకి ఒత్తుతూ, చేతితో కొద్దికొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా, చిరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయి. మొత్తం తాలికలు వేసిన తర్వాత, మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ నాలుగు ఐదు నిమిషాలు ఉడికించాలి.