Karuna Jain: మొదటి మ్యాచ్లోనే అర్ధసెంచరీ చేసి, మిథాలీతో కలిసి ఆడి.. ఆటకు గుడ్బై చెప్పిన సీనియర్ క్రికెటర్
Karuna Jain: టీమిండియా సీనియర్ మహిళా వికెట్ కీపర్ కరుణ జైన్ అంతర్జాతీయ క్రికెట్తో పాటు అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ఈమె 18 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించింది.
Updated on: Jul 24, 2022 | 9:08 PM

టీమిండియా సీనియర్ మహిళా వికెట్ కీపర్ కరుణ జైన్ అంతర్జాతీయ క్రికెట్తో పాటు అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

36 ఏళ్ల కరుణ జైన్ 2005 నుంచి 2014 మధ్య కాలంలో టీమిండియా తరఫున 5 టెస్టులు, 44 వన్డేలు, 9 టీ20 మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించింది.

2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కరుణ జైన్ తన తొలి మ్యాచ్లోనే అర్ధశతకంతో ఆకట్టుకుంది. వెస్టిండీస్తో జరిగిన ఆ మ్యాచ్లో ఆమె 64 పరుగులు చేసింది. ఇక 2005లో ప్రపంచకప్ ఫైనల్కు చేరిన భారత మహిళా జట్టులో జైన్ సభ్యురాలు కూడా.

టీమిండియా తరఫున 1100కు పైగా పరుగులు చేసిన కరుణ జైన్ ఖాతాలో వన్డేల్లో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి

2014లో ఇంగ్లండ్తో తన చివరి టెస్టు ఆడిన మిథాలీరాజ్తో కలిసి కూడా ఆడింది. ఈమె స్వస్థలం బెంగళూరు.





























