Pippali: మీ ఆహారంలో పిప్పళ్లు చేర్చండి.. అనారోగ్యాన్ని దూరం పెట్టండి..
పిప్పళ్లు మిరియాలలాగానే ఘాటుగా ఉంటాయి. వీటితో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. దగ్గు, ఆస్తమా, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు పిప్పళ్లు బాగా పనిచేస్తాయి. వీటి తరచు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి.? ఇవి ఎలా తీసుకొంటే మంచిది.? ఇలాంటి విషయాలు అన్ని ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం రండి..
Updated on: Jun 30, 2025 | 9:06 AM

పిప్పళ్ల పొడి 1 గ్రాము, పాత బెల్లం పొడి 5 గ్రా. తీసుకుని కలిపి చిన్న ఉండల్లా చేయాలి. వాటిని పూటకు ఒకటి చొప్పున మింగితే, దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. వాటిపై పిప్పళ్లు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. అసిడిటీ, ఛాతిలో మంట, పుల్లని త్రేన్పులు వంటి సమస్యలు పిప్పళ్లతో తగ్గించుకోవచ్చు.1గ్రాము పిప్పళ్ల పొడికి అర టీస్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే ఆయా సమస్యలు తగ్గుతాయ్.

ఓ మట్టి పాత్ర తీసుకొని అందులో పిప్పళ్లను వేయించి పొడి చేసుకోవాలి. ఆ పొడిని 3 గ్రాముల మోతాదులో తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి చప్పరించి మింగుతుండాలి. రోజుకు ఇలా 2 సార్లు చేయాలి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఆకలి బాగా అవుతుంది.

పిప్పళ్లు, వస పొడిలను సమాన భాగాల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని 3 గ్రాముల మోతాదులో గోరు వెచ్చని నీరు లేదా పాలతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. దీంతో మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. అర గ్రాము పిప్పళ్ల పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే వాంతులు, వికారం, తలతిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.

పిప్పళ్ల పొడిని 2 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనెకు కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. దీంతో అధిక బరువు ఈజీగా తగ్గుతారు. ఇది తీసుకున్న తరువాత 1 గంట పాటు ఏమీ తీసుకోకూడదు. ఇలా చేస్తేనే ఫలితం ఉంటుంది.

ఒక గ్లాస్ మజ్జిగలో 2 గ్రాముల పిప్పళ్ల పొడిని కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. దీని వల్ల మహిళల్లో ప్రసవం తర్వాత వచ్చే పొట్ట సమస్య త్వరగా తగ్గుతుంది. పొట్ట తగ్గి సమతలంగా అవుతుంది. దీంతో తల్లి క్షమాంగా ఉంటుంది.




