
కరివేపాకు, శనగపప్పు, వేరు శనగ గింజలు, ఎండు మిర్చితో కారం చేస్తే అదిరిపోతోంది. ఇది వేడి అన్నం, ఇడ్లీ, దోశల్లోకి అయితే రుచికరంగా ఉంటుంది.

ముందుగా కరివేపాకు ఆకులు తీసుకుని బాగా శుభ్ర పరచుకోవాలి. వాటిని తడి లేకుండా బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత వేరు శనగలను తీసుకుని వేయించుకోవాలి.

స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో మినప పప్పు, శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, ఎండుమిర్చి, చింతపండు, జీలకర్రను వేసి బాగా వేయించుకోవాలి.

ఈ మిశ్రమాన్ని తీసుకుని రోటిలో శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, ఎండుమిర్చిని వేసి మెత్తగా పొడి అయ్యేలా బాగా దంచుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి పొడిలాగా చేసుకోవాలి.

ఈ పొడిని వేడి వేడి అన్నంలో వేసుకుని, దానితో పాటు కొద్దిగా నెయ్యి వేస్తే తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.