
ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎంతో టేస్టీగా, ఆరోగ్యంగా చేసే స్వీట్ రెసిపీ ఇది. మీరు ఇక్కడ చెప్పే తయారీ విధానం చూసి చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఈ పచ్చి కొబ్బరి బెల్లం ఉండలు టీ తాగే సమయంలో కానీ, పండుగల సమయంలో కానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

పచ్చి కొబ్బరి బెల్లం ఉండలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం తురుము, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, కట్ చేసిన ఒక కప్పు జీడిపప్పు ముక్కలు, అర కప్పు ఎండుద్రాక్ష , ఇంకా దీనిలో బాదం పప్పులు కూడా వేసుకోవాలి. రుచిగా ఉంటాయి.

ముందుగా గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి అది బాగా వేడి అయిన తరవాత దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. కొద్దీ సేపటి తరవాత జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా దీనిలో వేసి వేయించి పక్కన పెట్టాలి. మళ్ళీ అదే పాన్లో బెల్లం ముక్కలు కూడా మీడియం మంటపై పాకం లాగా చేసుకోవాలి.

బెల్లం బాగా కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముదీనిలో వేసి అది గట్టిగా అయ్యేదాకా 10 నిముషాలు వీటిని కలుపుతూ ఉండాలి. ఇక చివరలో యాలకుల పొడి, వేయించిన 10 జీడిపప్పు, అర కప్పు ఎండుద్రాక్ష కూడా దీనిలో వేసి కలపాలి. ఇది చల్లారిన తర్వాత చేతికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రాసుకుని చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి ఉండలు రెడీ.

పచ్చి కొబ్బరి బెల్లం ఉండలు తినడం శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇవి బడికి శక్తిని ఇస్తాయి. ఇంకా ఈ బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది . ఇంకా పచ్చి కొబ్బరిలో ఉండే కొవ్వులు శరీరానికి బలాన్ని పెంచుతాయి. జీర్ణక్రియను కూడా మెరుగుపరస్తుంది. దీనిని హెల్తీ స్నాక్గా కూడా తినొచ్చు.