Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Auction: లక్ అంటే ఈ భారత ప్లేయర్లదే.. రిటైర్మెంట్ జోన్‌ నుంచి బయటపడ్డ 4గురు.. ఎవరో తెలుసా?

కొచ్చిలో జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో సామ్ కరణ్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టగా, కొంతమంది భారతీయ ఆటగాళ్ల కెరీర్ కూడా ప్రమాదం నుంచి బయటపడింది.

Venkata Chari

|

Updated on: Dec 24, 2022 | 6:50 AM

ఐపీఎల్ 2023 మినీ వేలంలో టోర్నమెంట్ మునుపటి రికార్డులన్నీ బద్దలయ్యాయి. పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ సామ్ కరణ్‌ను రూ. 18.50 కోట్లకు కొనుగోలు చేసి టోర్నీ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఆయనతో పాటు కామెరాన్ గ్రీన్ రూ. 17.50 కోట్లు, బెన్ స్టోక్స్ రూ. 16.25 కోట్లు, నిక్సన్ పూరన్ రూ. 16 కోట్లు దక్కించుకున్నారు. అదే సమయంలో, ఈ వేలంలో కొంతమంది భారత ఆటగాళ్లు ఉన్నారు. ఈ మినీ వేలం భారత ఆటగాళ్ల కెరీర్ ముగిసిపోకుండా కాపాడింది. వారెవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ 2023 మినీ వేలంలో టోర్నమెంట్ మునుపటి రికార్డులన్నీ బద్దలయ్యాయి. పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ సామ్ కరణ్‌ను రూ. 18.50 కోట్లకు కొనుగోలు చేసి టోర్నీ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఆయనతో పాటు కామెరాన్ గ్రీన్ రూ. 17.50 కోట్లు, బెన్ స్టోక్స్ రూ. 16.25 కోట్లు, నిక్సన్ పూరన్ రూ. 16 కోట్లు దక్కించుకున్నారు. అదే సమయంలో, ఈ వేలంలో కొంతమంది భారత ఆటగాళ్లు ఉన్నారు. ఈ మినీ వేలం భారత ఆటగాళ్ల కెరీర్ ముగిసిపోకుండా కాపాడింది. వారెవరో ఇప్పుడు చూద్దాం..

1 / 5
ఐపీఎల్ 2023 వేలంలో ప్రవేశించిన అతి పెద్ద వయసు ఆటగాడు అమిత్ మిశ్రా. 40 ఏళ్ల లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గత ఏడాది జరిగిన మెగా వేలంలో అమ్ముడుకాలేదు. ఈసారి తన బేస్ ధర రూ.50 లక్షలుగా ఉంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ అదే ధరకు కొనుగోలు చేసింది. అమిత్ మిశ్రా ఐపీఎల్ 2021లో చివరి మ్యాచ్ ఆడాడు. అతను మొత్తం 154 ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం కలిగి ఉన్నాడు. అందులో అతను 166 వికెట్లు తీసుకున్నాడు. అతను యుజ్వేంద్ర చాహల్‌తో పాటు బీసీసీఐ రిచ్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన భారతీయ బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో 3 హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్‌గా పేరుగాంచాడు.

ఐపీఎల్ 2023 వేలంలో ప్రవేశించిన అతి పెద్ద వయసు ఆటగాడు అమిత్ మిశ్రా. 40 ఏళ్ల లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గత ఏడాది జరిగిన మెగా వేలంలో అమ్ముడుకాలేదు. ఈసారి తన బేస్ ధర రూ.50 లక్షలుగా ఉంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ అదే ధరకు కొనుగోలు చేసింది. అమిత్ మిశ్రా ఐపీఎల్ 2021లో చివరి మ్యాచ్ ఆడాడు. అతను మొత్తం 154 ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం కలిగి ఉన్నాడు. అందులో అతను 166 వికెట్లు తీసుకున్నాడు. అతను యుజ్వేంద్ర చాహల్‌తో పాటు బీసీసీఐ రిచ్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన భారతీయ బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో 3 హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్‌గా పేరుగాంచాడు.

2 / 5
ఇషాంత్ శర్మ 2021లో చివరి ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడాడు. అయితే, ఈ ఆటగాడు రూ.50 లక్షలకు అమ్ముడయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులో ఇషాంత్‌ను చేర్చుకుంది. ఇషాంత్ 93 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీశాడు.

ఇషాంత్ శర్మ 2021లో చివరి ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడాడు. అయితే, ఈ ఆటగాడు రూ.50 లక్షలకు అమ్ముడయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులో ఇషాంత్‌ను చేర్చుకుంది. ఇషాంత్ 93 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీశాడు.

3 / 5
పీయూష్ చావ్లా కూడా గత సీజన్‌లో మ్యాచ్ ఆడలేదు. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. పీయూష్ చావ్లాకు 165 ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం ఉంది. అతని పేరు మీద 157 వికెట్లు ఉన్నాయి.

పీయూష్ చావ్లా కూడా గత సీజన్‌లో మ్యాచ్ ఆడలేదు. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. పీయూష్ చావ్లాకు 165 ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం ఉంది. అతని పేరు మీద 157 వికెట్లు ఉన్నాయి.

4 / 5
అజింక్య రహానే ఐపీఎల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. గత మూడు సీజన్లలో అతను ఘోరంగా ఫ్లాప్ అని నిరూపించుకున్నాడు. గత సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 19 సగటుతో 133 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే ఈసారి రూ.50 లక్షల బేస్ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. రహానెను కోల్ కతా విడుదల చేసింది.

అజింక్య రహానే ఐపీఎల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. గత మూడు సీజన్లలో అతను ఘోరంగా ఫ్లాప్ అని నిరూపించుకున్నాడు. గత సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 19 సగటుతో 133 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే ఈసారి రూ.50 లక్షల బేస్ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. రహానెను కోల్ కతా విడుదల చేసింది.

5 / 5
Follow us