AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు.. వెస్టిండీస్ పర్యటనలో ‘త్రిమూర్తుల’ వ్యూహం కలిసొచ్చేనా?

IND vs WI: ఫిబ్రవరి నెలలో న్యూజిలాండ్‌తో చివరిసారిగా టీ20 సిరీస్ ఆడిన టీమిండియా.. ఇప్పుడు సరిగ్గా 6 నెలల తర్వాత వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. క్రికెట్ సిరీస్‌లోని 3 ఫార్మాట్‌ల కోసం భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది.

Venkata Chari
|

Updated on: Jun 20, 2023 | 5:43 AM

Share
ఫిబ్రవరి నెలలో న్యూజిలాండ్‌తో చివరిసారిగా టీ20 సిరీస్ ఆడిన టీమిండియా.. ఇప్పుడు సరిగ్గా 6 నెలల తర్వాత వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. క్రికెట్ సిరీస్‌లోని మూడు ఫార్మాట్‌ల కోసం భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. వెస్టిండీస్ పర్యటన ముగింపులో టీ20 సిరీస్‌లో భారత జట్టు రంగంలోకి దిగనుంది.

ఫిబ్రవరి నెలలో న్యూజిలాండ్‌తో చివరిసారిగా టీ20 సిరీస్ ఆడిన టీమిండియా.. ఇప్పుడు సరిగ్గా 6 నెలల తర్వాత వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. క్రికెట్ సిరీస్‌లోని మూడు ఫార్మాట్‌ల కోసం భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. వెస్టిండీస్ పర్యటన ముగింపులో టీ20 సిరీస్‌లో భారత జట్టు రంగంలోకి దిగనుంది.

1 / 6
జులై 12 నుంచి కరీబియన్ జట్టుతో టెస్టు సిరీస్‌ను ప్రారంభించనున్న భారత్, ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. చివరగా, వెస్టిండీస్ పర్యటన ఆగస్టు 3 నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ముగుస్తుంది. ఈ ముక్కోణపు సిరీస్ కోసం పూర్తి  వెస్టిండీస్‌కు వెళుతోంది.

జులై 12 నుంచి కరీబియన్ జట్టుతో టెస్టు సిరీస్‌ను ప్రారంభించనున్న భారత్, ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. చివరగా, వెస్టిండీస్ పర్యటన ఆగస్టు 3 నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ముగుస్తుంది. ఈ ముక్కోణపు సిరీస్ కోసం పూర్తి వెస్టిండీస్‌కు వెళుతోంది.

2 / 6
అయితే టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడుతున్న పలువురు సీనియర్‌ ముఖాలకు టీ20 సిరీస్‌ నుంచి దూరంగా ఉంచనున్నట్లు సమాచారం. అలాగే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీని చేపట్టిన హార్దిక్ పాండ్యా.. వెస్టిండీస్‌తోనూ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

అయితే టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడుతున్న పలువురు సీనియర్‌ ముఖాలకు టీ20 సిరీస్‌ నుంచి దూరంగా ఉంచనున్నట్లు సమాచారం. అలాగే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీని చేపట్టిన హార్దిక్ పాండ్యా.. వెస్టిండీస్‌తోనూ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

3 / 6
నివేదికల ప్రకారం టీ20 జట్టులో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీకి చోటు దక్కదని చెబుతున్నారు. టీ20 టీమ్‌కు అధికారిక కెప్టెన్‌గా పాండ్యా ఎంపిక కానప్పటికీ, అతను త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నివేదికల ప్రకారం టీ20 జట్టులో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీకి చోటు దక్కదని చెబుతున్నారు. టీ20 టీమ్‌కు అధికారిక కెప్టెన్‌గా పాండ్యా ఎంపిక కానప్పటికీ, అతను త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

4 / 6
పాండ్యా 2022లో తన తొలి ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను టైటిల్‌కు తీసుకెళ్లాడు. ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో కూడా అతను జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి ఓడి నిరాశకు గురయ్యాడు.

పాండ్యా 2022లో తన తొలి ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను టైటిల్‌కు తీసుకెళ్లాడు. ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో కూడా అతను జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి ఓడి నిరాశకు గురయ్యాడు.

5 / 6
ఇప్పుడు టీ20 జట్టు నుంచి సీనియర్ ఆటగాళ్లను తప్పించేందుకు సిద్ధమవుతున్న టీమిండియా సెలక్టర్లు.. సీనియర్ల స్థానంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ వంటి యువ ప్రతిభావంతులతో టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో జరగనుంది. చివరి రెండు మ్యాచ్‌లు ఫ్లోరిడాలో జరగనున్నాయి.

ఇప్పుడు టీ20 జట్టు నుంచి సీనియర్ ఆటగాళ్లను తప్పించేందుకు సిద్ధమవుతున్న టీమిండియా సెలక్టర్లు.. సీనియర్ల స్థానంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ వంటి యువ ప్రతిభావంతులతో టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో జరగనుంది. చివరి రెండు మ్యాచ్‌లు ఫ్లోరిడాలో జరగనున్నాయి.

6 / 6