
ఐపీఎల్ 2025 సీజన్ అద్భుతంగా ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ సీజన్లో వ్యక్తిగత ప్రదర్శనలతో మెరిసిన పలువురు ఆటగాళ్లకు, అలాగే కొన్ని జట్లకు అవార్డులు లభించాయి. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, అలాగే అత్యంత విలువైన ఆటగాడు, ఎమర్జింగ్ ప్లేయర్ వంటి అవార్డులను దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు ఓసారి చూద్దాం..

గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన సాయి సుదర్శన్, IPL 2025 లో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. అతను 15 ఇన్నింగ్స్లలో 759 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సుదర్శన్ తొలిసారి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.

గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ 2025 లో పర్పుల్ క్యాప్ విజేత అయ్యాడు. ఈ సీజన్ లో అత్యధికంగా 25 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ తొలిసారి పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు.

గుజరాత్ టైటాన్స్కు చెందిన సాయి సుదర్శన్ IPL 2025 ఎమర్జింగ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఈ సీజన్లో అతను అత్యధిక పరుగులు సాధించాడు. అత్యధిక ఫోర్లు కొట్టాడు.

చెన్నై సూపర్ కింగ్స్ IPL 2025లో ఫెయిర్ ప్లే అవార్డును గెలుచుకుంది. ఈ సీజన్లో ఈ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచినప్పటికీ, ఫెయిర్గా ఆడటంలో ముందంజలో ఉంది.

ముంబై ఇండియన్స్కు చెందిన సూర్యకుమార్ యాదవ్ IPL 2025లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. అతను 16 మ్యాచ్ల్లో 717 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ IPL 2025 సూపర్ స్ట్రైకర్గా ఎంపికయ్యాడు. ఈ బ్యాట్స్మన్ 206.55 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డును గెలుచుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన వైభవ్, గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అతని స్ట్రైక్ రేటు 207గా నమోదైంది. ఈ అవార్డుతో పాటు అతనికి ఒక కారు కూడా బహుమతిగా లభించింది.

గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అత్యధిక డాట్ బాల్స్ వేసిన ఘనతను పొందాడు. ఈ సీజన్లో అతను 15 మ్యాచ్ల్లో 151 డాట్ బాల్స్ వేశాడు.

లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన నికోలస్ పూరన్, IPL 2025లో అత్యధిక సిక్సర్లు కొట్టినందుకు అవార్డును అందుకున్నాడు. ఈ సీజన్లో అతను 40 సిక్సర్లు కొట్టాడు.

సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన కమిందు మెండిస్ IPL 2025లో అత్యుత్తమ క్యాచ్గా అవార్డును అందుకున్నాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ క్యాచ్ను ఒంటి చేత్తో పట్టుకున్నాడు.

IPL 2025లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా సాయి సుదర్శన్ అవార్డును అందుకున్నాడు. ఈ సీజన్లో అతను 88 ఫోర్లు బాదాడు. ఈ సీజన్లో అత్యధిక ఫాంటసీ పాయింట్లు సేకరించినందుకు అవార్డును కూడా అందుకున్నాడు.