5 Players Announced Retirement: టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఐదుగురు ఆటగాళ్ళు టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ ఐదుగురిలో ముగ్గురు భారతీయులే కావడం విశేషం. ఈ ప్రకారం, ఈ ప్రపంచకప్తో తమ టీ20 అంతర్జాతీయ కెరీర్ను ముగించిన ఐదుగురు ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..
రోహిత్ శర్మ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. భారత్ తరపున 159 టీ20 మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 151 ఇన్నింగ్స్ల్లో మొత్తం 4231 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు చేశాడు. అలాగే, T20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత T20I క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
విరాట్ కోహ్లీ: టీ20 ప్రపంచకప్ను భారత్ గెలుచుకోవడంతో విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా తరపున 125 టీ20 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 117 ఇన్నింగ్స్ల్లో మొత్తం 4188 పరుగులు చేశాడు. ఇందులో 38 అర్ధసెంచరీలు, 1 భారీ సెంచరీ సాధించాడు.
రవీంద్ర జడేజా: టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా తన టీ20 అంతర్జాతీయ కెరీర్ను ముగించాడు. భారత్ తరపున 74 టీ20 మ్యాచ్లు ఆడిన జడేజా 41 ఇన్నింగ్స్ల్లో 515 పరుగులు చేశాడు. అలాగే 54 వికెట్లు పడగొట్టి రాణించాడు.
డేవిడ్ వార్నర్: ఈ ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు సూపర్-8 దశ నుంచి నిష్క్రమించిన తర్వాత వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా తరపున 110 టీ20 మ్యాచ్లు ఆడిన డేవిడ్ వార్నర్ మొత్తం 3277 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను ఒక సెంచరీ, 28 అర్ధ సెంచరీలు చేశాడు.
ట్రెంట్ బౌల్ట్: న్యూజిలాండ్ లెఫ్టార్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా తన టీ20 అంతర్జాతీయ కెరీర్ను ముగించాడు. కివీస్ తరపున 61 టీ20 మ్యాచ్లు ఆడిన బౌల్ట్ మొత్తం 83 వికెట్లు పడగొట్టాడు. 34 ఏళ్ల వయసులో టీ20 కెరీర్కు గుడ్బై చెప్పాడు.