Rajeev Rayala |
Updated on: Sep 19, 2021 | 11:22 AM
సంబరంగా సైమా అవార్డ్స్ .. అంగరంగ వైభవంగా జరిగిన సైమా 2021 అవార్దుల ప్రధానోత్సవం..
కరొనకారణంగా 2019 ఏడాదికి సంబంధించిన ‘సైమా’ అవార్డులను ఈ ఏడాది ప్రధానం చేశారు. ఇందులో ఉత్తమ నటుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు (మహర్షి ) అవార్డును దక్కించుకున్నారు.
ఉత్తమ నటి (క్రిటిక్స్) క్యాటగిరిలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న అవార్డును అందుకుంది.
ఉత్తమ నటుడు( క్రిటిక్స్ )గా నేచురల్ స్టార్ నాని అవార్డును సొంతం చేసుకున్నారు.
ఉత్తమ సహాయ నటుడిగా అల్లరి నరేష్ (మహర్షి) అవార్డును అందుకున్నారు.
అలాగే ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి (ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)గాను అవార్డ్ ను అందుకున్నాడు.
ఉత్తమ సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి) అవార్డును సొంతం చేసుకున్నారు.
ఇక ఉత్తమ విలన్ గా కార్తికేయ గుమ్మకొండ (గ్యాంగ్ లీడర్) సినిమాకు గాను అవార్డు దక్కించుకున్నారు.