
నితిన్ సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి గానీ ఏ ఒక్కటి అంచనాలు అందుకోవట్లేదు. మంచి టీంతోనే పని చేస్తున్నా.. కోరుకున్న విజయం మాత్రం రావట్లేదు నితిన్కు. కరోనాకు ముందొచ్చిన భీష్మ నితిన్కు చివరి హిట్.

ఆ తర్వాత చేసిన రంగ్ దే, మ్యాస్ట్రో, చెక్, మాచెర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ దారుణంగా నిరాశ పరిచాయి. నితిన్ ఆశలన్నీ ఇప్పుడు తమ్ముడు సినిమాపైనే ఉన్నాయి. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు.

చిన్న టీజర్ కూడా లేకుండా.. ఒక్క పాట కూడా రాకుండా డైరెక్ట్ ట్రైలర్నే విడుదల చేసి ట్రెండ్ సెట్ చేసారు మేకర్స్. సీరియస్ డ్రామాగా వస్తుంది తమ్ముడు. అక్క మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ చిత్ర కథ.

రొటీన్గా పాటలు, డైలాగ్స్ అని కాకుండా డిఫెరెంట్గా ఈ ట్రైలర్ను కట్ చేసారు. స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇందులో నితిన్ అక్కగా లయ నటిస్తున్నారు.

20 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. జులై 4న విడుదల కానుంది తమ్ముడు. అంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్ వాయిదా పడే అవకాశాలున్నాయని అర్థమవుతుంది.