
హీరోయిన్లందరిలోనూ నయనతార వేరయా అంటారు నిర్మాతలు. దానికి కారణం అందరికీ తెలుసు. ఓపెనింగ్స్కు రాదు.. ప్రమోషన్ చేయదు.. ఇంటర్వ్యూలు ఇవ్వదు.. నయన్ అదోరకం అంతే. కానీ ఏమైందో తెలియదు గానీ ఈ మధ్య ఈమెలో మార్పు మొదలైంది.

ప్రమోషన్స్కు రావడమే కాదు.. కొత్తగా సినిమా ఓపెనింగ్స్కు కూడా రావడం అలవాటు చేసుకుంటున్నారు. చూస్తున్నారుగా.. తాజాగా మూకూతి అమ్మన్ 2 ఓపెనింగ్కు వచ్చారు నయన్.

అప్పుడెప్పుడో 20 ఏళ్ళ కింద చంద్రముఖి ఓపెనింగ్కు వచ్చిన నయన్.. ఆ తర్వాత మళ్లీ పూజా కార్యక్రమాలకు వచ్చింది అరుదు. మళ్లీ ఇన్నాళ్లకు మూకుతి అమ్మన్ 2 ఓపెనింగ్లో దర్శనమిచ్చారు.

2020లో ఆర్జే బాలాజీ తెరకెక్కించిన 'మూకూతి అమ్మన్'కు సీక్వెల్ ఇది. ఫస్ట్ షాట్ నయనతారపై చిత్రీకరించారు. మామూలుగా ఓపెనింగ్స్, ప్రమోషన్స్కు రానని చెప్పే నయన్.. కొన్నాళ్లుగా మారిపోయారు.

అప్పట్లో 'శ్రీరామరాజ్యం' ప్రమోషన్స్ తర్వాత.. సొంత నిర్మాణంలో చేసిన ‘కనెక్ట్’ సినిమా కోసం బాగా ప్రమోట్ చేసారు నయన్. మళ్లీ ఇప్పుడు అమ్మవారి సినిమా కోసం వచ్చారు. చూస్తుంటే కాంపిటీషన్ తట్టుకోడానికి కండీషన్స్ ఎత్తేసినట్లు కనిపిస్తున్నారు ఈ బ్యూటీ.