కూతురితో కలిసి వెకేషన్ ఎంజాయ చేస్తున్న నమ్రత.. బ్యూటిపుల్ ఫొటోస్
నటి, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తాజాగా తన కూతురు సితార, స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Apr 27, 2025 | 9:16 PM

బ్యూటీ, అందాల తార నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటి మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. తర్వాత బాలీవుడ్లోకి అడుగు పెట్టి వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే ఈ అమ్మడు టాలీవుడ్ హీరో మహేష్ బాబును ప్రేమించింది. తర్వాత పెద్దల అంగీకారంతో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి, కుటుంబాన్ని చూసుకోవడంలోనే లీనమైపోయింది.

ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూ, మరో వైపు బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది నమ్రత. ఇక ఎప్పుడూ సోషల్ మీడియలో యాక్టివ్గా ఉండే ఈ నటి ఎప్పటికప్పుడు తన ఫొటోలను, తన పిల్లల ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ ఏకాస్త సమయం దొరికినా తన స్నేహితులు, ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తుంటుంది.

తాజాగా ఈచిన్నది తన కూతురు సితార, స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ అమ్మడు ఈ మధ్య చాలా వెకేషన్స్ కు వెళ్తు ఏంజాయ్ చేస్తుంది. సితార పలు జ్యువెలరీ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహారిస్తుండగా, కూతురితో కలిసి తన కూతురు బాధ్యతలను తానే చూసుకుంటూ.. కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది నమ్రత.



