Most Awaited Movies: ఈ ఏడాది రానున్న ఆ సినిమాలపైనే అందరి చూపులు.. వచ్చేది ఎప్పుడు.?
తెలుగులో ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే ఆశించిన విజయాన్ని అందుకున్నాయి. మే నెల టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉండే తెలుగులో ఈ ఏడాది విడుదల కానున్న కొన్ని సినిమా కోసమే ప్రేక్షకుల ఎదురు చూపులన్నీ.. మరి ఆ చిత్రాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..
Updated on: May 19, 2025 | 4:43 PM

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్లో ఉన్న తోలి చిత్రం ప్రభాస్ హీరోగా మారుతీ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం రాజా సాబ్. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్. ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. త్వరలో కొత్త డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంట నటిస్తున్న పీరియడ్ మూవీ హరిహర వీరమల్లు. దీనికి జ్యోతి కృష్ణ దర్శకుడు. మొదట క్రిష్ దర్శకత్వంలో కొంత సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని లాంగ్ బ్రేక్ పడింది. అన్ని అడ్డంకులు తొలగి ఇప్పుడు జూన్ 12న విడుదలకు సిద్ధమైంది.

అలాగే హనుమాన్ ఫేమ్ తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం మిరాయ్. ఇందులో మంచు మనోజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. రితిక నాయక్ ఇందులో హీరోయిన్. ఆగష్టు 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ జాబితాలో చిరు సినిమా కూడా ఉంది. అదే వశిష్ట దర్శకత్వంలో అయన హీరోగా నటిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఇందులో త్రిష హీరోయిన్. ఆషిక రంగనాథ్, సురభి పురానిక్, ఇషా చావ్లా ముఖ్య పాత్రధారులు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. జులైలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ లిస్ట్లో ఉన్న మరో సినిమా విజయ్ దేవరకొండ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కంప్లీట్ అయిపోయాయి. అయితే మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా దేశంలో నెలకొన్న కొన్ని పరిస్థితుల కారణంగా జులై 4కి వాయిదా పడింది. లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్.



















