ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇవి మారనున్నాయి… మీరు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ఇబ్బందుల్లో పడిపోతారు

మార్చి నెల ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దీంతో ఆర్థిక రంగంలో వివిధ రకాల లావాదేవీలు, పనులు పూర్తి చేసుకునేందుకు..

|

Updated on: Mar 31, 2021 | 8:56 PM

మార్చి నెల ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారబోతున్నాయి. ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనం కాబోతున్నాయి. దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకు వంటి ఎనిమిది బ్యాంకులు విలీనం అవుతున్నాయి. తర్వాత ఈ బ్యాంకు కస్టమర్ల చెక్‌ బుక్‌లు, పాస్‌బుక్‌లు సహా ఇతర బ్యాంకు విషయాలలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మీ ఖాతా కూడా ఇదే బ్యాంకుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ విలీనం అయ్యే బ్యాంకుల్లో మీ  ఖాతాలు ఉన్నట్లయితే సదరు బ్యాంకులకు వెళ్లి మీ బ్యాంకు చెక్‌బుక్‌లు, ఖాతాబుక్‌, తదితర వివరాలు మార్చుకోవాల్సి ఉంటుంది.

మార్చి నెల ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారబోతున్నాయి. ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనం కాబోతున్నాయి. దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకు వంటి ఎనిమిది బ్యాంకులు విలీనం అవుతున్నాయి. తర్వాత ఈ బ్యాంకు కస్టమర్ల చెక్‌ బుక్‌లు, పాస్‌బుక్‌లు సహా ఇతర బ్యాంకు విషయాలలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మీ ఖాతా కూడా ఇదే బ్యాంకుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ విలీనం అయ్యే బ్యాంకుల్లో మీ ఖాతాలు ఉన్నట్లయితే సదరు బ్యాంకులకు వెళ్లి మీ బ్యాంకు చెక్‌బుక్‌లు, ఖాతాబుక్‌, తదితర వివరాలు మార్చుకోవాల్సి ఉంటుంది.

1 / 4
 ప్రతి ఉద్యోగికి పీఎఫ్‌ ఎంతో ముఖ్యం. ఖాతాలో జమ అయిన రూ.2.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉద్యోగులకు ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు రూ.2.5 లక్షల పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు పీఎఫ్‌ విషయంలో భారీ ఊరట లభించినట్లయింది.

ప్రతి ఉద్యోగికి పీఎఫ్‌ ఎంతో ముఖ్యం. ఖాతాలో జమ అయిన రూ.2.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉద్యోగులకు ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు రూ.2.5 లక్షల పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు పీఎఫ్‌ విషయంలో భారీ ఊరట లభించినట్లయింది.

2 / 4
నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పన్ను పరిధిలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా సరే గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్​ దాఖలు చేయకపోతే వారిపై టీడీఎస్​ రేటు కాస్త అధికంగానే విధించాలనే ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇది కూడా ఇన్​కమ్​ టాక్స్​ చట్టంలోని 206 ఎబి, 206 సిసిఎ నిబంధనలకు లోబడే ఉంటుంది. 2021 ఏప్రిల్ 1 నుండి ఒక వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చినా సరే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్)ను దాఖలు చేయని సందర్భంలో, అతని బ్యాంక్ డిపాజిట్లపై రెట్టింపు టిడిఎస్ వడ్డీ వసూలు చేయబడుతుంది.

నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పన్ను పరిధిలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా సరే గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్​ దాఖలు చేయకపోతే వారిపై టీడీఎస్​ రేటు కాస్త అధికంగానే విధించాలనే ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇది కూడా ఇన్​కమ్​ టాక్స్​ చట్టంలోని 206 ఎబి, 206 సిసిఎ నిబంధనలకు లోబడే ఉంటుంది. 2021 ఏప్రిల్ 1 నుండి ఒక వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చినా సరే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్)ను దాఖలు చేయని సందర్భంలో, అతని బ్యాంక్ డిపాజిట్లపై రెట్టింపు టిడిఎస్ వడ్డీ వసూలు చేయబడుతుంది.

3 / 4
ఏప్రిల్‌ 1 నుంచి ఈ-ఇన్వాయిస్‌లు బి2బి (కంపెనీల మధ్య) లావాదేవీలకు రూ.50 కోట్లకుపైగా టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రూ.50 కోట్లకుపైగా టర్నోవర్‌ ఉన్న సంస్థలకు ఏప్రిల్‌ 1 నుంచి ఈ-ఇన్వాయిస్‌లు తప్పనిసరి చేసింది.

ఏప్రిల్‌ 1 నుంచి ఈ-ఇన్వాయిస్‌లు బి2బి (కంపెనీల మధ్య) లావాదేవీలకు రూ.50 కోట్లకుపైగా టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రూ.50 కోట్లకుపైగా టర్నోవర్‌ ఉన్న సంస్థలకు ఏప్రిల్‌ 1 నుంచి ఈ-ఇన్వాయిస్‌లు తప్పనిసరి చేసింది.

4 / 4
Follow us