- Telugu News Photo Gallery Business photos 5 new electric cars launching soon in india maruti to mg details in telugu
EV Cars: భారత మార్కెట్లో ఈవీ కార్ల క్యూ.. త్వరలో లాంచ్ కార్లు ఇవే..!
భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు రావడంతో అన్ని కంపెనీలు తమ వెర్షన్ ఈవీ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈవీ మార్కెట్లో టూవీలర్స్ అందులోనూ స్కూటర్ల కొనుగోలు బాగా పెరిగానా కార్ల విషయానికి వచ్చేసరికి వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే కొన్ని కంపెనీలు కార్ల ఈవీ మార్కెట్ను క్యాప్చర్ చేయడానికి సరికొత్త ఫీచర్స్తో తమ కార్లను భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్లో భారత మార్కెట్లో రీలీజ్ అవ్వబోయే ఈవీ కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Apr 05, 2025 | 4:29 PM

ఎంజీ విండ్సర్ ఈవీ త్వరలో లాంగ్-రేంజ్ వేరియంట్ కారు కింద భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. ఈ కారు 50 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో రావడం వల్ల ఈ కారు 460 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ వెర్షన్ మెరుగైన ఛార్జింగ్తో వస్తుందని చెబుతున్నారు. ఈ కారు మార్కెట్లో రిలీజైతే అత్యధిక అమ్మకాలను సాధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మహీంద్రా & మహీంద్రా ఎక్స్యూవీ 3 ఎక్స్ఓ ఈవీ కారు త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే ఎలక్ట్రిక్ ఎస్యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ఛార్జ్కి దాదాపు 450 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ కారు ముఖ్యంగా టాటా పంచ్ ఈవీకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మారుతి సుజుకీ ఈ-విటారా రాబోయే వారాల్లో లాంచ్ కానుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్తో వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారు లెవల్-2 ఏడీఏఎస్ టెక్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, పెద్ద టచ్స్క్రీన్, పనోరమిక్ సన్రూఫ్, ఎల్ఈడీ లైటింగ్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేషన్ ఫంక్షన్, ఆరు ఎయిర్బ్యాగ్లు వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో లాంచ్ కానుంది.

టాటా హారియర్ ఈవీ కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రదర్శించారు. ఈ కారు కొన్ని వారాల్లో భారత మార్కెట్ను పలుకరించనుంది. 75 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో నడిచే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీను ఓ సారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 500 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేసే డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సెటప్తో ఈ కారును లాంచ్ చేస్తున్నట్లు టాటా కంపెనీ చెబుతుంది.

ఎంజీ సైబర్స్టర్, ఎం9 ఎంపీవీ రెండూ కార్లు కొత్తగా స్థాపించిన ఎంజీ సెలెక్ట్ డీలర్షిప్ల ద్వారా అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ రెండు కార్లు టూ-డోర్-డ్రాప్-టాప్ స్పోర్ట్స్ సెటప్లో వస్తుంది. ఈ నెలలో ఎం9 ప్రీమియం ఎంపీవీ కంటే ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ కారులో విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన ఫీచర్స్తో ఆకట్టుకుంటుందని వివరిస్తున్నారు.





























