
చర్మ రక్షణ: బియ్యం నీటిలో సహజ పిండి పదార్థాలు, బియ్యం నుండి లభించే సెరామైడ్లు ఉంటాయి. ఇవి చర్మ రక్షణ పొరను బలపరచడంలో సహాయపడతాయి, ఇవి చర్మంపై తేమను పెంచడానికి హెల్ప్ చేస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. బియ్యం నీటిలో ఉండే సహజ పిండి పదార్థాలు మరియు సెరామైడ్లు చర్మం తేమను కోల్పోకుండా కాపాడతాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా కాలుష్యం నుండి రక్షిస్తుంది.

వృద్ధాప్య ఛాయలను తగ్గించడం: బియ్యం నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫెరూలిక్ యాసిడ్, గామా-ఒరిజనాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. NIH-ఇండెక్స్డ్ జర్నల్లో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఇందులో ఉండే ఫెరులిక్ యాసిడ్ మరియు గామా-ఒరిజానోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చర్మ కణాలు దెబ్బతినకుండా చూస్తాయి.

ప్రకాశవంతమైన చర్మం: సమ్మర్ ఎక్కువగా బయట తిరగడం వల్ల ముఖం త్వరగా నల్లబడుతుంది. బియ్యం నీటిలో ఉండే సమ్మేళనాలు పిగ్మెంటేషన్ మార్గాలను సున్నితంగా ప్రభావితం చేసి, మరింత సమమైన ఛాయను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. NIH ద్వారా ప్రచురించబడిన ఒక ఓపెన్-లేబుల్ క్లినికల్ అధ్యయనంలో చర్మంపై నల్లని మచ్చలను తగ్గించి, సహజమైన కాంతిని అందించడంలో బియ్యం నీరు సహాయపడుతుంది. ఇది చర్మ రంగును సమానంగా ఉంచుతుందని తేలింది.

మంట, ఎరుపుదనాన్ని తగ్గించడం: మొటిమలు లేదా చర్మంపై వచ్చే ఎరుపుదనాన్ని తగ్గించే 'అలంటోయిన్' అనే సమ్మేళనం బియ్యం నీటిలో ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా చేసి చర్మాన్ని శాంతపరుస్తుంది. చర్మం బిగుతుగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని ఇది ప్రోత్సహిస్తుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

అయితే బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అందరికీ ఇది సురక్షితం కాకపోవచ్చు. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, బియ్యం ఎక్కువగా తినే వారు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా నిల్వ చేయని పులియబెట్టిన నీటిలో బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది, కాబట్టి తాగే విషయంలో జాగ్రత్త అవసరం. కాబట్టి మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు